DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆస్తి కోసం అమరావతిలో తండ్రిపైనే అఘాయిత్యం. .  .

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 26, 2020 (డి ఎన్ ఎస్ ):* ఆస్తి కోసం కన్నతండ్రి పైన అఘాయిత్యం చేసి హతమొందించిన ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కొడుకులు ఇచ్చిన ఆస్తి చాల్లేదంటూ రాక్షసులుగా

మారారు. వృద్ధుడైన తండ్రిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా భౌతికంగా కర్కోటకులై మృతికి కారణమయ్యారు. కసాయి కొడుకుల దాష్టీకానికి బలైన తండ్రి కోమాలోకి వెళ్లి.. అటు నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ అత్యంత అమానుష ఘటన ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లా తాడికొండ

మండలం గరికపాడుకి చెందిన తూమాటి సుబ్బారావుకి నలుగురు కొడుకులు. తనకున్న పదెకరాల పొలంలో కొడుకులకి గతంలోనే ఒక్కో ఎకరం చొప్పున రాసిచ్చాడు. మిగిలిన ఆరెకరాలను తన వద్ద ఉంచుకున్నాడు. పెద్ద కొడుకు బ్రహ్మయ్య చనిపోవడంతో రెండు కొడుకు ఆదెయ్య వద్ద ఉంటున్నాడు. ఇటీవల తన ఆరెకరాల భూమిని కూడా కొడుకులకు సమానం పంచి ఇచ్చాడు. తన ఇంటిని

మాత్రం తనను చూసుకుంటున్న ఆదెయ్యకి ఇస్తానని చెప్పాడు.  అదే ఆ తండ్రి పాలిట నేరమైంది. ఇంటిని రెండో కొడుక్కి రాసిస్తాననడం మూడో కొడుకు వెంకటేశ్వరరావు, నాలుగో కొడుకు గోవిందయ్య నచ్చలేదు. ఆ విషయమై వివాదం చెలరేగింది. ఇల్లు ఒక్కడికే రాసివ్వడమేంటంటూ ఆగ్రహంతో రగిలిపోయిన చిన్న కొడుకులు తండ్రిని కర్రతో విచక్షణ రహితంగా

కొట్టారు. కనిపెంచాడన్నకనీస కనికరం లేకుండా కన్నతండ్రి భౌతిక దాడి చేసారు రాక్షసులు. దీంతో సుబ్బారావు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam