DNS Media | Latest News, Breaking News And Update In Telugu

42 కేంద్రాల్లో ఈ నెల 28 నుంచి ఏపిపీజీఇసెట్‌ పరీక్షలు

*నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: కన్వీనర్ పీఎస్ రావు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2020 (డి ఎన్ ఎస్):* రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌, ఫార్మశీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపిపీజీఇసెట్‌ ప్రవేశ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయని కన్వీనర్‌

డాక్టర్ పేరి శ్రీనివాస రావు తెలిపారు. శనివారం ఉదయం ఆంధ్ర విశ్వ కళాపరిషత్  (ఏయూ)  ఇంజనీరింగ్‌ కళాశాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియచేసారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 28,726 మంది దరఖాస్తు చేసారన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరన్నారు. 

*ఏపి, హైదరాబాదుల్లో 42 పరీక్ష కేంద్రాలు . . .

.*

రాష్ట్ర వ్యాప్తంగా  అనంతపురం, భీమవరం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు,  ఒంగోలు, చీరాల, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్రంలో 40 పరీక్ష కేంద్రాలతో పాటు హైదరాబాదులో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం

జరిగిందన్నారు.  విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్‌, గుర్తిపు కార్డును తీసుకురావాలన్నారు. 
ముఖానికి మాస్కులు  ధరించడం, శానిటైజర్‌ను వినియోగించడం తప్పనిసరి అన్నారు. పరీక్ష కేంద్రాలకు గంటన్నర ముందుగా విద్యార్థులు చేరుకోవాలన్నారు. 
ప్రతీ విద్యార్థికి శరీర ఉష్ణోగ్రత పరిశీలించి పరీక్షకు

అనుమతిస్తారన్నారు. అనారోగ్య లక్షణాలు కలిగిన విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదన్నారు. కోవిడ్‌ నియమావళిని అనుసరిస్తూ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షను నిర్వహించడం జరుగుతోందన్నారు.

*ఈ నెల 28 నుంచి పరీక్షలు...*

పరీక్షలు ఉదయం, మద్యాహ్నం

నిర్వహిస్తామన్నారు. 28న ఉదయం జియో ఇంజనీరింగ్‌ , జియో ఇన్ఫర్మేటిక్స్‌, మద్యాహ్నం కంప్యూటర్‌ సైన్స్‌,  ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, 29న ఉదయం సివిల్‌, ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌, బయో టెక్నాలజీ, మద్యాహ్నం నుంచి మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఫుడ్‌ టెక్నాలజీ, 30వ తేదీన ఉదయం ఇనుస్ట్రుమెంటేషన్‌, మెటలర్జీ, కెమికల్‌ ,

మద్యాహ్నం నానో టెక్నాలజీ, ఫార్మశీ కోర్సులకు పరీక్షలు  నిర్వహిస్తామన్నారు.

*మొత్తం 28,726 మంది దరఖాస్తులు : . . .* 

బయోటెక్నాలజీకి 164, సివిల్‌ ఇంజనీరింగ్ కు 4858, కెమికల్‌ ఇంజనీరింగ్ కు 192, కంప్యూటర్‌ సైన్స్‌కు 4084, ఎలక్ట్రానిక్స్‌  ఇంజనీరింగ్  కు 4736, ఎలక్ట్రికల్‌  ఇంజనీరింగ్ కు 3486,

ఇనుస్ట్రుమెంటేషన్‌కు 99, ఫుడ్‌ టెక్నాలజీకి 72, జియో ఇంజనీరింగ్‌కు 72, మెకానికల్‌ ఇంజనీరింగ్ కు 4570, మెటలర్జీ  ఇంజనీరింగ్ కి  46, నానో టెక్నాలజీకి 69, ఫార్మశీకి అత్యధికంగా 6349 మంది దరఖాస్తు చేసారన్నారు.
v

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam