DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెంగుళూరు లో ఎన్ ఐఏ కేంద్రం ఏర్పాటుకు అమిత్ షా ఒకే

*చిన్నకార్యకర్త జాతీయ అధ్యక్షుడు కావడం బీజేపీ లోనే సాధ్యం* 

*యువతకు చాన్సు ఇచ్చేది బీజేపీ మాత్రమే, ఇతర పార్టీలు కబుర్లకే*

*దిన్ మే కుస్తీ. . రాత్ కో దోస్తీ.  .ఇదే కేరళ ప్రభుత్వ పరిస్థితి*  

*బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్,

విశాఖపట్నం)* 

*విశాఖపట్నం / న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 27, 2020 (డి ఎన్ ఎస్):* దక్షణాది రాష్ట్రాలను మరింత సురక్షితం చేసేందుకు జాతీయ రక్షణ సంస్థ (ఎన్ ఐ ఏ) ప్రాంతీయ కేంద్రం ను బెంగుళూరు లో ఏర్పాటు చేసేందుకు రక్షణ మంత్రి అమిత్ షా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు బెంగుళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య తెలిపారు. ఆదివారం

నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలం లో బెంగుళూరు లో దేశద్రోహులు సృష్టించిన భయానక ఘటనలు దక్షిణాది రాష్ట్రాలను ఉలిక్కిపెడేట్టు చేశాయన్నారు. స్లీపర్ సెల్సు, జీహాదీ, దేశద్రోహ శక్తులు విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. వీటన్నింటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించి, దేశాన్ని మరింత సురక్షితం

కల్పించాలని తానూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి, ఎన్ ఐ ఏ ఏర్పాటుచేయాలని కోరడం జరిగిందన్నారు. బెంగుళూరు, మంగుళూరు, కేరళ, పరిసరాల్లో ఈ దేశ విద్రోహ శక్తులు వ్యాప్తి చెందేందుకు సిద్దపడుతున్నాయని, వాటిని సమర్ధవంతంగా అదుపుచేయాలన్నారు. 

ఒక కార్యకర్త నుంచి జాతీయ అధ్యక్షుడి గా. . .

ఒక సాధారణ

కార్యకర్త జాతీయ అధ్యక్షునిగా ఎన్నిక కావడం కేవలం భారతీయ జనతా పార్టీ లోనే జరుగుతుందని, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య తెలియచేసారు. ఇదే విషయం తన విషయం లోనే రుజువైందన్నారు. సామాన్య యువమోర్చ కార్యకర్త గా ఉన్న తనకు జాతీయ యువమోర్చ అధ్యక్షునిగా అవకాశం లభించడమేనన్నారు. శనివారం బీజేపీ జాతీయ కమిటీ ప్రకటించిన

నేపథ్యంలో బెంగుళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య ను భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షునిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన పార్టీ అగ్ర నేతలందరికీ ధన్యవాదాలు తెలియచేసారు. గతంలో యువమోర్చ అధ్యక్షులుగా భాద్యతలు నిర్వహించిన ప్రమోద్ మహాజన్, కిషన్ రెడ్డి, రాజ్నాథ్ సింగ్, జగత్

ప్రకాష్ నడ్డా, ఉమా భారతి, జి. కిషన్ రెడ్డి, పూనమ్ మహాజన్ లు సామాన్య కార్యకర్తల స్థాయి నుంచే వచ్చారన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కిషెన్ రెడ్డి తర్వాత తనకు అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. 
సామాన్య కార్యకర్తలు చేసే సేవ, కృషిని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం కేవలం బీజేపీ లోనే జరుగుతుందని, ఇతర పార్టీ

ల్లో యువతకు ప్రోత్సాహాలు కేవలం మాటలకే పరిమితమన్నారు. చేతల్లో కనపడదన్నారు. 

దిన్ మే కుస్తీ. . రాత్ కో దోస్తీ.  .ఇదే కేరళ పరిస్థితి  

కేరళ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం దిన్ మే కుస్తీ. . రాత్ కో దోస్తీ.  .గా ఉందని తేజస్వి మండిపడ్డారు. కేరళలో స్థానిక నేతలు, యువత పై

జరుగుతున్న విధ్వంస కాండపై అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని, పైగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం నోరెత్తడం లేదన్నారు. ఈ విధమైన అంశాలపై కేంద్రం దృష్టి సారిస్తోందన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam