DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిసి ఫుటేజ్ ఆధారంగా గుడి దొంగలు పట్టివేత. . .

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 28, 2020 (డి ఎన్ ఎస్ ):* రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలము నల్లజర్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయంలోకి తలుపులను గడ్డపారతో పగల గొట్టి

లోనికి ప్రవేశించి హుండీ ని పగలగొట్టి నగదును అపహరించిన విషయంపై నల్లజర్ల పోలీస్లు దర్యాప్తు చేసారు. దేవాలయం కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొవ్వూరు డి.ఎస్.పి కె. రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి గూడెం రూరల్ సిఐ వి.రవి కుమార్ నల్లజర్ల ఎస్ ఐ, కె. చంద్రశేఖర్  సదరు కేసును విచారించారు. విచారణ సమయంలో దేవాలయానికి ఉన్న

సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గా స్పష్టముగా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ది. ఈ సీసీ కెమెరాలు యొక్క ఆధారాలను పురస్కరించుకుని ముద్దాయిలు అయిన ఇద్దరు వ్యక్తులను 24 గంటలలో నల్లజర్ల పోలీసులు చట్టంతో సంఘర్షణకు గురైన జువనల్ గా గుర్తించారు. 
తాడేపల్లిగూడెం రూరల్ సిఐ వి.రవి

కుమార్ తెలియజేశారు. తాడేపల్లి గూడెం రూరల్ సిఐ మాట్లాడుతూ ఈ కేసులో చట్టంతో సంఘర్షణకు గురి అయిన జువనల్  గుర్తించడానికి అత్యంత కీలకమైన సీసీ కెమెరాలు యొక్క ఫుటేజీలు అని, కావున ప్రతి ఒక్కరూ దేవాలయాల వద్ద మరియు ఇళ్ళ వద్ద మరియు వ్యాపార సంస్థల వద్ద  సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి అని ఇప్పటికే పలు ప్రాంతాలలో ప్రజలకు

అవగాహన సదస్సులను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్ ఆదేశాలపై నిర్వహించడం జరిగినట్లు. కావున ప్రతి ఒక్కరూ సి.సి కెమెరాలను ఏర్పాటు  చేసుకోవడం చాలా అవసరమని తెలియ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam