DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 న చలో మదనపల్లి చేపడుతున్నాం: మాజీ ఎంపీ హర్షకుమార్

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 28, 2020 (డి ఎన్ ఎస్ ):* న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్ర రావు పై జరిగిన దాడిని నిరసిస్తూ ఈనెల 30వ తేదీన చలో మదనపల్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పలు సామజిక

వర్గాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.  సోమవారం రాజమహేంద్రవరం లోని మున్సిపల్ కాలనీ లోని హర్షకుమార్ నివాసంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులతో ఈ దాడి చేశారని ఆరోపించారు. జరిగిన దాడి పై ప్రభుత్వాన్ని

నిలదీస్తామన్నారు.  దేవాలయాలు, విగ్రహాలపై దాడులు జరుగుతుంటే స్పందిస్తున్న బిజెపి, జనసేన పార్టీలు రాష్ట్రం లో జరుగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ  సభలు పెట్టి  దాడులకు గురైన బాధితులకు అండగా నిలబడడం తోపాటు వారికి అవసరమైన న్యాయ సహాయం చేసినందుకు న్యాయ

కమిటీలు వేయాలని విజయవాడ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam