DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నన్నయ లో లైంగిక వేధింపుల కేసు రెండవ దశ విచారణ

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 28, 2020 (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ఆదికవి  నన్నయ  విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగ అధ్యాపకుడు డా. ఎన్. సూర్య రాఘవేంద్రపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపనలపై రెండవ దశ విచారణ సోమవారం నిర్వహించారు.

 ఈ  కేసులో  విచారణ  కమిషనర్ గా  రిటైర్డ్  హైకోర్టు  జడ్జి  జస్టిస్  బి. శేషశయన రెడ్డి ని  నియమించడం  జరిగింది.

  విశ్వవిద్యాలయంలో సోమవారం  జస్టిస్ బి. శేషశయన రెడ్డి పర్యటించగా జిల్లా ఐదవ అడిషనల్ మెజిస్టేట్ బి.శ్రీనివాస్, యూనివర్సిటీ లీగల్ ఆఫిసర్ నందెపు

నాగేంద్రరావు స్వాగతం పలికారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు, రిజిష్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు మర్యాదపూర్వకంగా కలిసారు. విశ్వవిద్యాలయంలోని ఈసీ హాల్ లో నిర్వహించిన విచారణకు డా.ఎన్.సూర్యరాఘవేంద్ర, విద్యార్థులు, ఇరుపక్షాల న్యాయవాదులు హాజరైయ్యారు. డా.ఎన్. సూర్య రాఘవేంద్రపై

వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపనలపై 14.10.19న కేసు నమోదు అయింది. దీనికి సంబంధించి విచారణ కమిషనర్ శేషశయన రెడ్డి ఈ నెల 16వ తేదిన నన్నయ విశ్వవిద్యాలయంలో మొదటి దశ విచారణ నిర్వహించిన విషయం తెలిసినదే. ఈ క్రమంలో రెండవ దశ విచారణ సోమవారం జరిగింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam