DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వృత్తి విద్యలో పట్టు సాధించాలి: నన్నయ వీసీ జగన్నాథరావు

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 29, 2020 (డి ఎన్ ఎస్ ):* 

వృత్తి విద్యలో విద్యార్థులు పట్టు సాధించాలని నూతన విద్యా విధానం ద్వారా అనేక అవకాశాలు విద్యార్థులకు ఉన్నాయని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. నూతన జాతీయ విద్యావిధానం మరియు వృత్తి విద్య కోర్సులపై  మంగళవారం

విశ్వవిద్యాలయంలో వర్క్ షాపు ను నిర్వహించారు. మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్కషాపు కు ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు హాజరై ఉపన్యాసాన్ని అందించారు. దీనిలో వీసీ మాట్లాడుతూ సెప్టెంబర్ 5వ తేది నుండి అక్టోబర్ 5వ తేది

వరకు “జాతీయ విద్య మాసం”గా ప్రకటించి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వర్క్ షాపును నిర్వహించడం జరిగిందని తెలిపారు. వృత్తి విద్య కోర్సులలో ఉపాధ్యాలకు, అధ్యాపకులకు నూతన విద్యా విధానానికి సంబంధించిన అంశాలపై అవగాహాన కల్పించేందుకు ఈ వర్క్ షాప్ ఎంతో

ఉపయోగపడుతుందని చెప్పారు. వృత్తి విద్యా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని దానిలో నైపుణ్యాన్ని అలవర్చుకొని అంగిత భావంతో పని చేయాలని తెలియజేసారు. నూతన విద్యా విధానంలో నైపుణ్యాభివృద్దికి అధిక ప్రాధన్యత ఉంటుందని తెలిపారు. నిత్య జీవితంలో అవసరమైన వాటిపై పూర్తి అవగాహాన కల్పించేందుకు చక్కని కార్యక్రమాలు

అందుబాటులోనికి వస్తాయని అన్నారు. మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ద్వార విశ్వవిద్యాలయం భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలను చెపడుతుందని చెప్పారు. బి.ఈడీ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తెలియజేసారు. మహాత్మాగాంధీ

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ చైర్మన్ డా.డబ్లయు.జి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ జాతీయ విద్య మాసంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను గురించి వివరించారు. రిజిష్ట్రార్ బట్టు గంగారావు నిర్వహకులను అభినందించి ఇటువంటి అవగాహాన సదస్సులు విద్యా ప్రమాణాలకు అద్దం

పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.సుబ్బారావు, వర్క్ షాప్ కన్వినార్ డా.ఎం.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam