DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తర్వాత సీఎస్ ఎవరు? రేసులో సీనియర్‍ ఐఎఎస్‍లు. .

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 01, 2020 (డి ఎన్ ఎస్ ):* ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ పదవి కాలం ఈ డిసెంబర్ తో మూస్తోంది. ఇప్పటికే ఆమెకు ఆరు నెలలు సర్వీసు పొడిగించారు.. మళ్లీ పొడిగించేందుకు నిబందనలు అంగీకరించవు. దీంతో ఈ పోస్ట్ లో కొత్తవారిని ఎవరి నియమిస్తారో, దీనికోసం పలువురు

సీనియర్ ఐఏఎస్ లు రేస్ లో ఉన్నారు. 

వారిలో ఆదిత్యనాద్‍ దాస్‍, సతీష్‍ చంద్ర, నీరబ్‍కుమార్‍ ప్రసాద్‍లు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం సతీష్ చంద్ర ఉన్నత విద్యాశాఖాదిపతి గాను, నీరబ్ ప్రసాద్ సిసిఎల్‍ఏ మరియు అటవీ శాఖాదిపతి గాను విధుల్లో ఉన్నారు.  ఈ ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నప్పటికీ.. తాను కూడా

సిఎస్‍ రేసులో ఉన్నానని.. వ్యవసాయ, పశుసంవర్దక శాఖాదిపతిగా బాద్యతలు నిర్వహిస్తున్న పూనం మాల కొండయ్య అంటున్నారట. ఆదిత్య నాద్‍దాస్‍కు ఆరు నెలలే సర్వీసు ఉన్నందున ఆయనను సిఎస్‍ పోస్టులో జగన్‍ నియమిస్తారా..?

అపార అధికార అనుభవం ఉన్న సతీష్‍చంద్రను (చంద్రబాబు హయాంలో నాలుగేళ్లు సిఎంవో ఇంఛార్జి అధికారిగా

బాధ్యతలు నిర్వహించారు) సిఎం జగన్‍ నియమిస్తారా… ఆయనకు కేవలం 11 నెలలు మాత్రమే సర్వీసుంది. ఇటీవల కాలంలో సిఎం జగన్‍రెడ్డి.. నీరబ్‍కుమార్‍ ప్రసాద్‍కు ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే కమిటీలన్నింటిలో నీరబ్‍ తప్పనిసరిగా ఉంటున్నారు. ఆయనకు మరో మూడేళ్ల సర్వీసు undo, ఆదిత్యనాద్‍ దాస్‍, సతీష్‍ చంద్ర,

నీరబ్‍ కుమార్‍ ప్రసాద్‍లలో ఒకరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించటం ఖాయం. సిఎంవో అధికారి ప్రవీణ్‍ ప్రకాష్‍ ఈ ముగ్గురిలో ఎవరికి అండగా ఉంటారు.. ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనే విషయం బయట పడటం లేదు. ప్రవీణ్‍ ప్రకాష్‍ ప్రభావాన్ని అంత తేలికగా తీసుకోకూడదు. రాబోయే రోజులలో కాబోయే సిఎస్‍ ఎవరు అనే విషయాన్ని

డిసెంబరు చివరి మాసాంతంలో సిఎం జగన్‍ బయట పెడతారే తప్ప ముందుగా ఎలాంటి సంకేతికాలు ఇవ్వరని అధికారులు చెప్పుకుంటున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam