DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచివాలయ సిబ్బందికి కరతాళ ధ్వనులతో అభినందన

*(DNS report : SV Acharyulu, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, అక్టోబర్ 02, 2020 (డి ఎన్ ఎస్ ):* రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.ఆర్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది సేవలకు కరతాళ ధ్వనులతో అభిందించే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున జరిగింది. సచివాలయ వ్యవస్ధను రాష్ట్రంలో ఏర్పాటు చేసి గాంధీ

మహాత్ముని జయంతి నాటికి ఏడాది కాలం పూర్తి కావడం, గ్రామ స్వరాజ్యానికి నాంది కావడం జరిగింది. ప్రభుత్వ సేవలు ప్రజల చెంతకు చేరడంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు నిరుపమాణం. ఈ సందర్భంగా జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి

డా.సీదిరి అప్పల రాజు, జిల్లా కలెక్టర్ జె నివాస్, వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొని కరతాళ ధ్వనులతో అభిందనలు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య

మంత్రి, సభాపతి, పశుసంవర్దక శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్ధను కొనియాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడంలో సిబ్బంది సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ వంటి కష్టకాలంలో సైతం ప్రాణాలను అడ్డంగా పెట్టి పోరాటం సలిపారని చెప్పారు. ప్రజలకు రానున్న

రోజుల్లో మరిన్ని మంచి సేవలు అందించి మన్ననలు పొందాలని, వృత్తిలో సంతృప్తి సాధించాలని సూచించారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదం గుర్తెరిగి స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ప్రజల కష్టాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. 
    ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరపాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరక్టర్

బి.నగేష్, జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam