DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*కాలుష్య నివారణ కోసం వైజాగ్ పోర్టు తీసుకుంటున్న చర్యలివే*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 06, 2020 (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కాలుష్య నివారణ కోసం వైజాగ్ పోర్టు తీసుకుంటున్న చర్యలను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె. రామ్మోహన్ రావు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని  మంగళవారం నిర్వహించిన విలేకరుల

సమావేశంలో అయన మాట్లాడుతూ బోగ్గు ఇనుము వంటి కార్గో హ్యాండ్లింగ్ ను పూర్తిగా యాంత్రీకరణ చేయడం కోసం పిపిపి మోడ్ లో 2 వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకూ  ఖర్చు చేసింది.
నిల్వ కేంద్రాల చుట్టూ గ్రీన్ బెల్ట్ అభివృద్ది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తోంది.గత మూడేళ్లలో పచ్చ దనాన్ని

పెంపొందించేందుకు  10.50 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకూ 4 లక్షల 50 వేల మొక్కలను పెంచారు. ఈ ఏడాది 2020_21 కి 1.02 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు.

హుదుద్ సమయంలో విశాఖలో  పచ్చదనం పూర్తిగా కనుమరుగు అయినది. తిరిగి పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రీన్ విశాఖలో భాగంగా పోర్ట్ కు 5.65 లక్షల మొక్కలను జిల్లా

యంత్రాంగం కేటాయించింది. ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖతో కలిసి 2.30 కోట్ల రూపాయలతో 2 లక్షల మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని పోర్ట్ కనసాగిస్తున్నారు.

పోర్ట్ స్టాక్ యార్డ్ లలోని బొగ్గు నిల్వలపై టార్ఫలిన్ కవర్లను కప్పి ఉంచుతున్నారు. వీటి నిర్వహణను పోర్ట్ యాజమాన్యం నిరంతరం పర్యవేక్షిస్తుంది.
యాంత్రీకరణ ద్వారా

ధూళిని గాలిలోకి ఎగరకుండా చేసేందుకు బొగ్గు నిల్వలపై నిరంతరం నీటిని చిమ్మే విధానాన్ని కొనసాగిస్తున్నారు.

10 ఎంఎల్ డి  నీటి శుద్ది ప్లాంట్ ద్వారా పోర్టు కు అవసరమైన నీటి అవసరాలను తీర్చుతున్నారు. పోర్టు పరిసర ప్రాంతాల్లో దుమ్ము ధూళీ ఎగరకుండా నిత్యం ఈ ప్లాంట్ ద్వారా శుద్ది చేసిన నీటిని రోడ్లపై చిలకరించి

కాలుష్య నివారణ చర్యలను కొనసాగిస్తున్నారు.  వేసవిలో ధూళి నగరంపైకి విస్తరించకుండా రోజుకు 250 టాంకర్లతో  ప్రత్యేకంగా దుమ్మును నివారించేందుకు వినియోగిస్తున్నారు.
నిల్వ కేంద్రాల నుంచి దుమ్ము ధూళి నగరంపైకి ఎగర కుండా నిల్వ కేంద్రాల చుట్టూ 24 కోట్ల రూపాయలతో కాన్వేంట్ జంక్షన్ నుంచి హెచ్ 8 జంక్షన్ వరకూ 4.2 కిలోమీటర్ల

వరకూ  11.5 మీటర్ల ఎత్తైన గోడను నిర్మించారు.

85 లక్షల వ్యయంతో ట్రక్ టైర్ వాషింగ్ సౌకర్యాన్ని కల్పించారు.బెర్త్ ల వద్ద లోడింగ్ అన్ లోడింగ్ జరుగుతున్న సమయంలో ధూళి ఎగర కుండా 85 లక్షల విలువైన రెండు ఫాగ్ కెనాన్స్ వినియోగిస్తున్నారు. రోడ్డుపై నున్న దుమ్మును ఊడవడానికి యాంత్రీకరణ స్వీపింగ్ యంత్రాన్ని వినియోగంలోకి

తీసుకువచ్చారు.

2016లో సుమారుప 60 కోట్ల రూపాయలతో 10 ఎం డబ్యూ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం. 190 కేవీ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటు . దీని ద్వారా ఉత్పత్తి అయ్యే 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ లో 7.40 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను పోర్టు తన సొంత అవసరాలకు వినియోగించు కోవడమే కాకుండా మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు

అనుసంధానం చేసి తద్వారా ఆదాయాన్ని సైతం పొందుతోంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పోర్టు తనకు కావలసిన 100 శాతం విద్యుత్ ను వినియోగించుకుంటోంది

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam