DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విమానాశ్రయం పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలి

*పంచాయితీలకు సబ్‌ కలెక్టర్ అనుపమ‌ ఆదేశం*

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 06, 2020 (డి ఎన్ ఎస్ ):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం చుట్టు పక్కల గల తొమ్మిది పంచాయితీల్లో నూరు శాతం పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని ఆయా పంచాయితీ కార్యదర్శులను సబ్‌ కలెక్టర్‌ అనుపమ

అంజలి ఆదేశించారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం రాజమహేంద్రవరం విమానాశ్రయం పరిసర ప్రాంతంలో గల కోరుకొండ మండలంలోని గ్రామ పంచాయితీలైన మధురపూడి, బూరుగుపూడి, జగన్నాథపురం(గుమ్ములూరు), బుచ్చింపేట, గాడాల, నిడిగట్ల, రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలోని కోలమూరు, తొర్రేడు, సీతానగరం మండలంలోని ఉండేశ్వరపురం గ్రామ

పంచాయితీలకు చెందిన కార్యదర్శులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విమానాశ్రయం పరిసర గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలు, విమానాశ్రయం అధికారుల నుంచి వచ్చిన సూచనలపై సమీక్షించారు. ఇటీవల కాలంలో విమానాశ్రయం అభివృద్ధి కమిటి ఛైర్మన్‌,

జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో విమానాశ్రయం అధికారులు తీసుకొచ్చిన కొన్ని సమస్యలకు సంబంధించి ఆయా పంచాయితీ కార్యదర్శులు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి మాట్లాడుతూ విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాల్లో మెరుగైన

పారిశుద్ధ్య పనులను  చేపట్టాలన్నారు. ఆయా పంచాయితీల్లో మాంసం దుకాణాల ద్వారా మిగిలిపోతున్న వ్యర్థ పదార్ధాలను అక్కడే వదిలివేయడం వల్ల పక్షులు, ఇతర జంతువులు ఆయా ప్రాంతాలకు చేరుతున్నాయని అన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను వేయడం వల్ల అపారిశుద్ధ్యం నెలకొంటుందని తెలిపారు. అలాగే విమానాశ్రయం ప్రహారీ గోడ

చుట్టూ చెట్లు ఉండటం వల్ల కోతులు ఆ చెట్లు ద్వారా పైకి ఎక్కి రన్‌ వేపైకి వస్తున్నాయని గుర్తించారని తెలిపారు. కావున మాంసం దుకాణదారులు వెంటనే తమ తమ దుకాణాల్లో మిగిలిపోతున్న వ్యర్థాలను సమూలంగా నాశనం చేసేందుకు అవసరమైన నిర్ణీత స్థలాన్ని కేటాయించాలని సూచించారు. ఆ వ్యర్థ పదార్ధాలను నిర్ణీత ప్రదేశంలో నాశనం చేసేలా ఆయా

వ్యాపారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. విమానాశ్రయం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఫౌల్ట్రీ ఫారమ్‌ షెడ్లు ఉన్నట్లు అయితే తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు. ప్రహారీ గోడ చుట్టు పక్కల ఉన్న తోట యజమానులు తక్షణమే ఆయా చెట్ల కొమ్మలను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మురుగునీటిని రోడ్లపైకి వదిలివేయడం వల్ల

కూడా కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయని, కావున తాత్కాలికంగా అయినా కచ్చా డ్రైన్లు ఏర్పాటు  చేసుకునేలా పంచాయితీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఆయా గ్రామాల నుంచి సేకరించే చెత్తను పొడి, తడి చెత్తగా సేకరించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైతే పంచాయితీకి చెందిన జనరల్‌

ఫండ్స్‌ను వినియోగించాలని సూచించారు. అదనపు బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై విమానాశ్రయం అధికారులతో సంప్రదింపులు చేస్తామని, ఈలోపుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, త్వరలోనే జిల్లా కలెక్టర్‌ విమానాశ్రయం అభివృద్ధికి సంబంధించి సమీక్ష చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డిఎల్‌పిఒ జె.శ్రీనివాసులు, రూరల్‌ ఎంపీడీఒ

నాతి బుజ్జి, కెఆర్‌ఆర్‌సి తహసీల్దార్‌ జె.శ్రీనివాసులు ఆయా పంచాయితీల్లో తీసుకోవాల్సిన చర్యలపై కార్యదర్శులకు అవగాహన కల్పించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam