DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విఎంఆర్డిఏ కు సీతంరాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ కు ద్రోణంరాజు?

*వైఎస్ జగన్ బ్రాహ్మణులకు పెద్దపీట వేయనున్నారా?*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 12, 2020 (డి ఎన్ ఎస్):* విశాఖ నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సీతంరాజు సుధాకర్ కు విశాఖపట్నం మెట్రో అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ సంస్థ (వి ఎం ఆర్ డి ఏ) చైర్మన్ గాను, ద్రోణంరాజు శ్రీవాత్సవ

ను ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గానూ నియమించే అవకాశాలు దాదాపు ఖరారయ్యాయి. 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో బ్రాహ్మణ సంఘాల సంపూర్ణ మద్దతు కోసం చేస్తున్న కృషిలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల నుంచి పార్టీ కి ఆర్ధిక, సామాజిక

రంగాల్లో అండగా నిలబడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సీతంరాజు సుధాకర్ కు అగ్రతాంబూలం ఇచ్చేందుకు సిద్దపడ్డట్టు సమాచారం. ఈయన విశాఖ నగరానికి చెందిన బ్రాహ్మణ ప్రముఖులు. గత ఎన్నికల నుంచి పార్టీకి ఆర్థికంగా అండగా సైతం నిలిచి, భారీ మొత్తం లో నిధులు సైతం అందించిన దాఖలాలు ఉన్నాయి. ప్రజా సంకల్ప యాత్రలో సైతం పార్టీ తరపున భారీ

ఎత్తున బ్రాహ్మణ గర్జన ఏర్పాటు చేసారు. పార్టీ కి ఈయన చేసిన సేవలకు గుర్తింపుగాను ఈయనకు విశాఖపట్నం మెట్రో అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ సంస్థ (వి ఎం ఆర్ డి ఏ) చైర్మన్ గా నియమించనున్నారు.

ఇటీవలే దివంగతులైన వి ఎం ఆర్ డి ఏ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కుమారుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ కు ఆంధ్ర

ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించే అవకాశాలు దాదాపు ఖరారు చేసారు. ద్రోణంరాజు సత్యనారాయణ వారసునిగా ఆ కుటుంబం నుంచి శ్రీవాత్సవ కు ఎం ఎల్ సి పదవి అవకాశం ఇవ్వాలని వస్తున్నా డిమాండ్ ల నేపథ్యంలో ఈ పదవి ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam