DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీ వర్షాలు సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 14, 2020 (డి ఎన్ ఎస్ ):* రాష్ట్రం లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత, మంత్రి బొత్స సత్యనారాయణ,

సీఎస్ నీలం సాహ్ని పాల్గొన్నారు.
భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగు సూచనలు చేసారు. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. విద్యుత్‌ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ

పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు. అదేసమయంలో వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని అన్నారు. తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలన్న సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam