DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ ను గెలిపిస్తే ఉద్యోగులకు బంపర్ అఫర్

ఆర్టీసీ ఎన్నికల్లో ఉద్యోగులకు ఈయూ బంపర్ అఫర్ 

విశాఖపట్నం, జులై 17, 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఏపిఎస్ ఆర్టీసి ) గుర్తింపు సంఘం

ఎన్నికల్లో ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ ని గెలిపిస్తే ఉద్యోగులకు 2013 నుంచి రావల్సిన బాండ్లు రూపంలో ఉన్న బకాయి డబ్బులను ఒకేసారి వచ్చేలా చేస్తామని ఏపిఎస్

ఆర్టీసిఎంప్లాయీస్ రాష్ట్రఅదనపు ప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు హామిఇచ్చారు. సంస్థ ఎన్నికలు ఆగస్టు 9 న జరగ బోతున్నతరుణంలో ఎన్నికల హడావిడి ముమ్మరం

అయ్యింది.
మంగళ వారం మద్దిలపాలెం & విశాఖపట్నం డిపోలవద్ద ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ జిల్లాస్దాయి ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆర్టీసి కార్మికచైతన్యయాత్ర

సభలు జరిగింది. à°ˆ సభల్లో ముఖ్యఅతిదిగా పాల్గొన్న అయన మాట్లాడుతూ  à°‰à°¦à±à°¯à±‹à°—ులకు 2013 వేతనసవరణ కు సంబందించి ఇంకా రావల్సి ఉన్న 80% బాండ్లు రూపంలో ఉన్న బకాయి డబ్బులను

ఒకేసారి మొత్తం 2019 జూన్ లోగా ఇప్పిస్తామని తెలిపారు. 2016 పిబ్రవరి 18 న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన వెంటనే అరియర్సు బాండ్లు డబ్బులు 100 రోజు లో మొత్తం

యిప్పిస్తామని హామిఇచ్చిగెలిన NMU నాలకులు 27 నెలలు తరువాత బండ్లులో 20% డబ్బులు మాత్రమే గత నెలలో ఇప్పించి మిగినవి నాలుగు విడతలుగా 2022 వరకు సంవత్సరానికి 20 % చొప్పున నాలుగు

సంవత్సరాలు ఇప్పించడానికి ఒప్పంద చేసుకొని కార్మికులను నమ్మించి మోసం చీకటి ఒప్పందాన్ని చేసిన NMU నాయకత్వానికి ఈ ఎన్నికల్లో కార్మికులను ఓట్లు అడిగే

హక్కేలేదని దామోదరరావు ఆరోపించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఇ.యు రాష్ట్ర కార్యదర్శి నందమూరి రామారావు, విజయనగరం జోన్ జోనల్ కార్యదర్శి పెంట బానుమూర్తి లు

మాట్లాడుతూ ఏప్రిల్ 1 ,2017 నుండి జరగాల్సిన వెేతనల సవరణ ఇప్పడికీ జరగలేదని, ఇంకా పేస్కేల్స్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు అంటే వీటికి సంబందించిన PRC అరియర్సును NMU ను ఈ

సారి కూడా గెలిపిస్తే ఎప్పుడు ఇప్పిస్తారు... మరో దశాబ్దం తర్వాత రప్పిస్తారా అని ఎద్దేవా చేశారు. ఈ సభలో పాల్గొన్న విశాఖ జిల్లా AITUC జిల్లా అద్యక్షులు పడాల రమణ

మాట్లాడుతూ విశాఖజిల్లాలో కార్మికుల శ్రమశక్తిని దోచుకుంటున్న NMU ని ఓడించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం లో ఇ.యు జోనల్ ప్రతినిధులు

కె.జె.శుభాకర్,కె.యస్.రావు,వి.రాదాకృష్ట,à°Ÿà°¿.వి.మూర్తి 
రీజన్ అద్యక్ష,కార్యదర్శులు యు.యస్.నారాయణ,అల్లుసురేష్ నాయుడు , .శ్రీనువాసరావు, స్వామి రాజు,వై.రాము, సాయిబాబా

యం.శంకరరావు తదితరనాయకులు డిపోనాయకులు బి.యల్.రావు,కృష్ట,యం.వి.యస్.రెడ్డి వీరితోపాటు అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam