DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయవాడ ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరం: డిజిపి

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 16, 2020 (డి ఎన్ ఎస్ ):* విజయవాడలోని క్రీస్తురాజు పురం లో ప్రేమోన్మాది చేసిన ఘాతుకం ఘటన చాలా బాధాకరం అని ఆంధ్ర ప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ ఆవేదన వ్యక్తం చేసారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ  ఇటువంటి ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది

లేదన్నారు. ఈ కేసు సిపి స్వీయ పర్యవేక్షణలో  జరిగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాం అన్నారు. దిశ  స్ఫూర్తిగా ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నారులపై, మహిళలపై దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ శాఖ ఉపేక్షించదని హెచ్చరించారు.

సమాజంలో జరుగుతున్న ఇటువంటి వింత పోకడలను అరికట్టాల్సిన భాద్యత మన అందరిపైనా ఉందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam