DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శబరిమల యాత్రలో అయ్యప్పలకు అన్నీ ప్రతిబంధకాలే. . . 

*ఆన్ లైన్ లో నమోదు, కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్ ఉండాలి.* 

*పంబ స్నానం రద్దు, నెయ్యి అభిషేకం పై నిషేధం.* 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 16, 2020 (డి ఎన్ ఎస్ ):* గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, మరోవైపు ప్రఖ్యాత శబరిమల యాత్రకు సమయం దగ్గర

పడుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. శబరీ మల యాత్రకు వచ్చే అయ్యప్పలకు ప్రతిబంధకాలు ఇబ్బడి ముబ్బడిగా విధించేసింది. ఇతర రాష్ట్రాల నుంచి శబరిమల యాత్రకు వచ్చే భక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ నుంచి శబరిమల ఆలయానికి ఏటా పెద్దఎత్తున భక్తులు

వెళ్తారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్‌ మెహతా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు మార్గదర్శకాలకు సంబంధించి ఓ లేఖను రాసినట్టు సమాచారం. 

మార్గదర్శకాలు:-

శబరిమల యాత్రకు వచ్చే భక్తులు ముందుగానే కేరళ పోలీసు శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్‌ క్యూ

పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం https:/z/sabarimalaonline.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆలయంలోకి అనుమతి.

వారాంతాల్లో రోజుకు 2 వేల మంది చొప్పున, మిగిలిన రోజుల్లో రోజుకు వెయ్యి మందికి చొప్పున మాత్రమే పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకునే

వీలుంది. పరిస్థితులను బట్టి మార్పులు ఉండొచ్చు.

దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ ఫలితం వచ్చిన వారికి మాత్రమే ఆలయ ప్రవేశానికి అనుమతి. ముందుగా టెస్టులు చేసుకోని వారికి ప్రవేశ మార్గంలోనూ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, కరోనా లేదని తేలితేనే ఆలయంలోనికి

అనుమతిస్తారు.

పదేండ్ల లోపు, 60 ఏండ్లు పైబడిన వారికి అనుమతి నిరాకరణ. దీర్ఘకాలిక గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని కూడా దర్శనానికి అనుమతించరు.

యాత్రకు వచ్చే భక్తులు ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంట తెచ్చుకోవాలి.
స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు,

సన్నిధానంలో రాత్రి బసకు అనుమతి నిరాకరణ.

ఎకుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులకు అనుమతి. మిగతా అన్ని మార్గాలు తాత్కాలికంగా మూసివేత.

శనివారం నుంచి భక్తులకు అనుమతి
కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి చివరి వారంలో మూతబడిన శబరిమల ఆలయం తొలిసారిగా శుక్రవారం సాయంత్రం తెరుచుకోనున్నది.

నెలవారీగా నిర్వహించే పూజల్లో భాగంగా ఐదు రోజుల పాటు ఆలయాన్ని తెరువనున్నారు. అయితే, భక్తులకు శనివారం ఉదయం నుంచి ఆలయ ప్రవేశం కల్పిస్తారు. రోజుకు 250 మంది చొప్పున మాత్రమే అనుమతిస్తారు. 

శబరిమల యాత్రకు ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను.. ఈ ఐదు రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులు కూడా పాటించాలి.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam