DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ, రాజమండ్రి ఫొటోగ్రఫర్లకు జాతీయ అవార్డులు

*రాజమండ్రి ఆంధ్ర భూమి బాబి, విశాఖ ప్రజాశక్తి రాజేష్*

*కఠోర శ్రమకు తగిన గుర్తింపు ఈ జాతీయ పురస్కారాలు: DNS*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 16, 2020 (డి ఎన్ ఎస్):*  స్పాప్  (SPAAP--STATE PHOTOJOURNALIST ASSOCIATION OF ANDHRA PRADESH ) నిర్వహించిన ఇండియన్ ప్రెస్ ఫోటో అవార్డ్స్ 2020 లో విశాఖపట్నం,

రాజమహేంద్రవరం కు చెందిన ఫొటోగ్రఫేర్లకు జాతీయ అవార్డులు లభించాయి. రాజమహేంద్రవరం నుంచి ఆంధ్రభూమి ఫోటోగ్రాఫర్ ఎస్ బి రాజేశ్వరరావు (బాబి) జాతీయ స్థాయి ఎచీవ్మెంట్ అవార్డు గెలుపొందగా, విశాఖపట్నం కు చెందిన కె. రాజేష్ ( ప్రజా శక్తి ) కు సామాజిక చిత్రీకరణ విభాగం లో అవార్డు లభించింది. 

రాజేశ్వర రావు రాజమండ్రి

పత్రికారంగంలో గత 20 సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో విధులు నిర్వహిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ అవార్డుల పోటీలలో తన ప్రతిభను చాటుతూ అవార్డును పొందుతూనే ఉన్నారు. 2017 జరిగిన పోటీలలో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి పొందారు. గోదావరి నది లో పుణ్య దీపోత్సవాన్ని వెలిగిస్తున్న చిత్రానికి గాను ఈయనకు ఈ ఏడాది జాతీయ

పురస్కారాన్ని పొందారు. 

కె. రాజేష్ గత కొన్నేళ్లుగా ప్రజా శక్తి పత్రికలో అంచెలంచెలుగా ఎదిగి, ఫిలిం కెమెరా స్థాయి నుంచి నేటి డిజిటల్ వరకూ అన్ని తరహాల కెమెరాల వినియోగం లో ఎంతో నైపుణ్యం సాధించారు. ఎన్నో ప్రత్యక్ష ఉద్యమాలను తన కెమెరాలో అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఇటీవల విశాఖ శివారు గ్రామమైన ఆర్ ఆర్

వెంకటాపురం లోని ఎల్ జి పొలిమర్సు లో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులు ఆసుపత్రిలో ఒకే బెడ్ పై ముగ్గురు చికిత్స పొందుతున్న దృశ్యాన్ని చిత్రీకరించారు. దీనికి జాతీయ పురస్కారం లభించింది. 

ఈ అవార్డులను వరల్డ్ ఫోటో జర్నలిజం డే నవంబర్ 1వ తారీఖున విజయవాడలో అందించనున్నారు. 

ప్రస్తుత 2020  పోటీలు  మూడు

విభాగాలుగా నిర్వహించారు. అవి  1 ఓపెన్ కలర్ 2 ఫోటో జర్నలిజం సెక్షన్  3 ఫోటో ట్రావెల్ సెక్షన్ గా నిర్వహించారు. ఈ పోటీలకు జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల నుండి ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. జాతీయ స్థాయిలో 303 మంది  ఫోటోగ్రాఫర్లు 22 రాష్ట్రాల నుండి  3023 ఫోటోలను ఈ పోటీలకు పంపించారు. 
ఈ పోటీలు జాతీయస్థాయిలో గత 5

సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పోటీలలో విజేతల వివరాలను శుక్రవారం విజయవాడలో సమాచార శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి స్పాస్  కమిటీ సభ్యులు సమక్షంలో విడుదల చేశారు. ఈ పోటీలకు స్పాస్ సెలాన్ చైర్మన్ సి హెచ్ వి ఎస్ విజయ భాస్కర్ రావు  సెక్రటరీ ఆర్ వి కోటేశ్వరరావు టీం సభ్యులు నిర్వహించారు. పోటీల

న్యాయనిర్ణేతగా ఎం రవీంద్రనాథ్ టి శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ నారాయణ రావు వ్యవహరించారు.

కఠోర శ్రమకు తగిన గుర్తింపు ఈ పురస్కారాలు: DNS

రాజేశ్వర రావు, రాజేష్ లకు లభించిన జాతీయ ఫోటోగ్రఫీ పురస్కారం వెనుక వారి ఎన్నో సంవత్సరాల కఠోర పరిశ్రమ ఉందని, వారు సాధించిన విజయానికి DNS న్యూస్ ఏజెన్సీ న్యూస్ ఎడిటర్ పి

రాజా, చీఫ్ ఎడిటర్ సాయిరాం సి వి ఎస్ లు హార్దిక శుభాకాంక్షలు తెలియచేసారు. 
ఒక పాత్రికేయునికి సాధారణంగా గుర్తింపు లభించాలంటేనే ఎంతో శ్రమ చేయాల్సి యుంటుందని, అలాంటిది జాతీయ స్థాయి అవార్డు లభించాలంటే . . దాని వెనుక ఎంతో కఠోర పరిశ్రమ ఉందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam