DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసుల త్యాగాలు ఎంతో పవిత్రమైనవి, ఉన్నతమైనవి

*పోలీస్ అమరుల కుటుంబాలకు అభివాదం: సీఎం వైఎస్ జగన్* 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 21, 2020 (డి ఎన్ ఎస్ ):* పోలీసు సిబ్బంది చేసిన త్యాగాలు ఎంతో పవిత్రమైనవి, ఉన్నతమైనవి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలియచేసారు. బుధవారం పొలిసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన

వారికి అంజలి ఘటించారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నామన్నారు. అనధికారులు నుంచి అధికారుల వరకూ ఎందరో పోలీస్ సిబ్బంది చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు ఇది అన్నారు. ప్రాణాలు వదిలిన ప్రతి పోలీస్ కుటుంభానికి మన దేశం జేజేలు పలుకుతుందన్నారు. అధికారగణం  నిష్టగా నిర్వహించాల్సిన

కార్యక్రమం ఇదేనన్నారు. తలసరి ఆదాయం చూసి దేశ అభివృద్ది ని అంచనా వేస్తారని, కానీ నేరాల రేటు తగ్గడం కూడా చాలా ముఖ్యం అని తెలిపారు. రాత్రికి రాత్రి అది జరుగదు, కానీ తగ్గించే ప్రయత్నం మన ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందని తెలియచేసారు. లా అండ్ ఆర్డర్ ప్రభుత్వానికి అతి ముఖ్య అంశం అని, పిల్లలు, మహిళలు, వృద్ద ల భద్రత అతి ముఖ్యం

అన్నారు. బడుగు, బలహీన వర్గాల వారి పై దాడిని సహించమని హెచ్చరించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుని చట్టం ముందు నిలబెట్టాలన్నారు. దోషులు ఎంత పెద్ద వారు అయినా వదిలే ప్రసక్తే ఉండకూడదన్నారు. 

మహిళల భద్రత కోసం దిశ బిల్లు తెచ్చామని, దిశ బిల్లు త్వరలో ఆమోదం పొందుతుంది అని ఆశిస్తున్నామన్నారు. పోలీసుల కష్టం నాకు

తెలుసునని, కరోనా సమయం లో ఏ స్థాయిలో పోలీసులు పని చేశారో అందరికీ తెలుసునన్నారు. టెక్నాలజీ విసిరే సవాళ్లు, కోవిడ్ లాంటి హెల్త్ ఎమర్జెన్సీ లు, ఇసుక, మద్యం అక్రమ రవాణా లాంటివి అడ్డుకోవడానికి పడే కష్టం నాకు తెలుసు అన్నారు. ఏడాదికి 6500 పోలీస్  పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపామని, పోలీసు అమరవీరుల కుటుంబాలకు మంచి జరగాలని

భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. 

ఈ కార్యక్రమం లో రాష్ట్ర హోంశాఖామంత్రి మేకతోటి సుచరిత, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతమ్ సవాంగ్ ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam