DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో  75 కిమీ మేర మెట్రో రైల్: మంత్రి బొత్స

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 21, 2020 (డి ఎన్ ఎస్ ):* విశాఖపట్టణం మెట్రో రైల్ ప్రాజెక్టు  డిపిఆర్ ను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు పై విజయవాడలో బుధవారంనాడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, స్పెషల్ సెక్రటరీ రామ మనోహర్ రావు, మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్న సమావేశంలో పలు అంశాలను చర్చించారు. కోవిడ్ కారణంగా డిపిఆర్  రూపకల్పనలో ఆలస్యం జరిగినప్పటికీ మరికొద్ది రోజుల్లో దీనికి తుదిరూపు ఇవ్వనున్నట్లు అధికారులు ఈసందర్భంగా మంత్రికి

వివరించారు. విశాఖ మెట్రో దారి మొత్తం దాదాపుగా ఎలివేటెడ్ గానే ఉండనుంది. ఈసందర్భంగా విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు ఏ ఏ మార్గాల్లో మెట్రో రైల్ ఏర్పాటుకు అవకాశాలున్నాయన్న దానిని చర్చించారు . 
విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ - కొమ్మాడి జంక్ష న్ వరకు, గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీసు వరకు, తాడిచెట్లపాలెం- చిన

వాల్తేర్ , కొమ్మాడి జంక్షన్ – భోగాపురం వరకు నాలుగు క్యారిడార్లలో మెట్రో రైల్ లైన్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈక్యారిడార్లన్నీ కలిపి సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో కనెక్టివిటీ వస్తుందని అధికారులు తెలిపారు. నిర్దేశించిన క్యారిడార్లలో ఎక్కడెక్కడ స్టేషన్లు ఏర్పాటు చేస్తే, ప్రజలకు సౌకర్యవంతంగా

ఉంటుంది, నిర్వహణ సౌలభ్యం తదితర విషయాల్లో తుది అంచనాలకు వచ్చే ముందు అవసరమనుకుంటే మరోసారి క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అంతే కాకుండా ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు అవసరం, గ్రీనరీ తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి మెట్రో

పూర్తి అయితే, 2025 నాటికి మెట్రో రైల్ లో సగటున రోజుకు 6 లక్షల మంది ప్రయాణించే అవకాశముందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. మెట్రో రైల్ స్టేషన్లు, రైల్వే లైన్ల ఏర్పాటుకు వీలైనంత వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలనే వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నామని, కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు భూముల సేకరణ తప్పనిసరి అయ్యే

అవకాశముందని ఇందుకు సంబంధించిన వివరాలను కూడా డిపిఆర్ లో పొందుపరుస్తామని అధికారులు పేర్కొన్నారు.
    ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ మార్గాలను కూడా డిపిఆర్ లో పొందుపర్చాలని మంత్రి అధికారుకు స్పష్టం చేశారు. అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి  అత్యుత్తమ ప్రమాణాలతో విశాఖ మెట్రో రైల్

ఉండేలా ప్రణాళికను రూపొందించాలని మంత్రి అధికారులను మంత్రి ఆదేశించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam