DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్తదానం ప్రచారం కోసం సైకిలు యాత్ర చేస్తున్న బెంగాల్ యువకులు

విశాఖపట్నం, జులై 17 , 2018 (DNS Online ): రక్తదానం చెయ్యండి.- ప్రాణాలు కాపాడండి  à°…నే నినాదం తో సైకిళ్ళ పై సాహస యాత్ర చేస్తున్నట్టు జాదవ్ పూర్ ( పశ్చిమబెంగాల్) కు చెందిన ఇద్దరు

సాహసయాత్రీకులు పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖపట్నం చేరుకున్న జయ్ దేవ్ రౌత్ ( 47 ఏళ్ళు ), శివ లాల్ బిస్రా ( 22 ఏళ్ళు ) లు స్థానిక యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా విశాఖ శాఖ

ఆధ్వర్యవం లో జరిగిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఈ నెల 1 న కలకత్తాలో ప్రారంభించిన తమ సైకిల్ యాత్ర తమిళనాడు లోని కన్యాకుమారి వెళ్లి, అక్కడ నుంచి తిరిగి

కలకత్తా చేరడం తో ముగుస్తుందని తెలిపారు. మొత్తం 5000 కిలోమీటర్ల దూరం తీరం వెంటబడి జరిగే ఈ సైకిల్ ర్యాలీ ప్రధాన లక్ష్యం అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం

చెయ్యాలని, తద్వారా ఒక ప్రాణాన్ని కాపాడాలని చేపట్టినట్టు వివరించారు. కలకత్తా లో బయలుదేరి, ఖరాగపూర్, భాగేశ్వర్, భద్రక్, కటక్, భుబనేశ్వర్, ఖుర్దా, చిత్రపురి,

శ్రీకాకుళం మీదుగా 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి విశాఖపట్నం చేరుకున్నారు. ఇక్కడ నుంచి  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡, చెన్నై మీదుగా కన్యాకుమారి చేరుకోనున్నారు. రోజుకు సుమారు 70

 à°•à°¿à°²à±‹à°®à±€à°Ÿà°°à±à°² దూరం ప్రయాణం చేస్తూ మార్గమధ్యలో ప్రతీ చోటా అర్హులైన వారందరూ రక్తదానం చెయ్యాలని, అవసరమైన వారికి జీవన దానం చెయ్యాలి అని పిలుపునిస్తున్నట్టు

తెలియచేస్తున్నట్టు తెలిపారు. ఈ బృందానికి సీనియర్ పాత్రికేయులు, విశాఖపట్నం యూత్ హాస్టల్స్ అధ్యక్షులు ఎన్. నాగేశ్వర రావు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ

విలేకరుల సమావేశం లో విశాఖపట్నం జిల్లా శాఖ చైర్మన్ à°¡à°¿. సత్య బుద్ధు, ఉపాధ్యక్షులు వానపల్లి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam