DNS Media | Latest News, Breaking News And Update In Telugu

90 మంది బాల కార్మికులకు విముక్తి

అమరావతి, అక్టోబర్ 20,2020

 

 ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నూజివీడు డివిజన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన  తనిఖీల్లో 90 మంది చిన్నారులకు విముక్తి లభించింది.డివిజన్ స్థాయిలోను వీధుల వెంబడి తిరుగుతున్న మరియు కూలీ పనులు చేస్తున్న చిన్నారులను    స్థానిక పోలీస్ స్టేషన్ల కు తరలించారు.అనంతరం

చిన్నారుల తల్లిదండ్రులుకు అప్పగించారు.ఈసందర్భంగా హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు,నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు,   ఆపరేషన్ ముస్కాన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.డీఐజీ మోహనరావు మాట్లాడుతూ ముస్కాన్ కార్యక్రమం  అక్టోబర్ 28,29 తేదీల్లో

జరుగుతుందని,చిన్నారుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వారికి వైద్య పరీక్షలు నిర్వహించనునట్లు వివరించారు.తల్లిదండ్రులు లేని చిన్నారులకు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారాన్ని తీసుకుని వారిని ప్రయోజకులుగా తీర్చే చర్యలును ఐసీడీస్ అధికారులు తీసుకోవాలని కోరారు.వీధి బాలలు,బాల కార్మికులు పట్ల నిర్లక్ష్యంగా

వ్యవహరిస్తే రానున్న రోజుల్లో వారు నేరాలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.తల్లిదండ్రులు సైతం చిన్నారులను పనికి పంపకుండా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో నూజివీడు, హనుమాన్ జంక్షన్ సి ఐ డి.వి.రమణ, మైలవరం సి ఐ పి.శ్రీను మరియు సబ్ డివిజన్ ఎస్ ఐ లు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam