DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నగరం లో టర్కీ కరెన్సీ పేరిట మోసం,  ఆరుగురు అరెస్ట్ 

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*

విశాఖపట్నం, నవంబర్ 07,2020  (డి ఎన్ ఎస్): నగరం లో టర్కీ కరెన్సీ, రంగురాళ్ల  పేరిట జరిగిన మోసం ఘటనల్లో విశాఖపట్నం పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి రంగురాళ్లు రెండు కేసుల్లో 4 వ టౌన్ పోలీసులు ఆరుగురు వ్యక్తులను

అదుపులోకి తీసుకున్నారు. నగరం నడిబొడ్డులో  పోర్టు స్టేడియం వద్ద ఇలా రూ.5 లక్షలు అడ్వాన్సు అడుగుతుండగా ద్వారకా క్రైం పోలీసులకు సమాచారం అందగా దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఫోర్త్ టౌన్ పోలీసులకు అప్పగించారు. విదేశీ కరెన్సీ పేరిట అక్కడి చెల్లని నోట్లను పత్రాలుగా చూపిస్తూ ఈ ఇద్దరు సభ్యులు ప్రజల్ని మోసం

చేస్తున్నట్టు గుర్తించారు.  
విదేశాల్లో డిమాండ్ అధికంగా ఉండే రంగురాళ్లు తమ వద్ద ఉన్నాయంటూ ప్రజల్ని మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులు ఇక్కడి గోంగూర హోటల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అన్ పాలిష్ట్ పేరిట రాళ్లను చూపించి వీటికి మహిమలు కూడా ఉంటాయని, రంపచోడవరం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఇవి

లభ్యమవుతంటాయంటూ పది రాళ్లను చూపిస్తున్న ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి వాటి ఖరీదు ఇక్కడ చాలా తక్కువేనని పోలీసులే చెబుతున్నారు. అమాయక ప్రజల్ని భారీగా లాభాలు ఆర్జించవచ్చంటూ మోసం చేస్తున్న ఈ ముఠా సభ్యులు ఇప్పుడు పోలీసులకు చిక్కగా ఫోర్త్ టౌన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ అజిత వేజెండ్ల ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఇతర పొలిసు అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam