DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భక్తులకు సౌకర్యంగా స్నాన రేవుల్లో ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే భవాని

(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)  
అమరావతి, నవంబర్ 09, 2020  (డి ఎన్ ఎస్): కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్నానపు రేవుల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ సూచించారు. సోమవారం ఆమె గోదావరి గట్టున

ఉన్న పిండాల రేవు, కోటిలింగాల రేవులను నగరపాలక సంస్థ  అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారని, అందువల్ల వారికి అసౌకర్యం కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళలు

దుస్తులు మార్చుకునేందుకు ఇబ్బంది లేకుండా గదులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. 

ఆధ్యాత్మికంగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలోని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు

కాబట్టి అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam