DNS Media | Latest News, Breaking News And Update In Telugu

11 నుంచి అరసవల్లి సూర్యదేవాలయంలో కేశఖండనకు ఒకే  

(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)  

శ్రీకాకుళం, నవంబర్ 09, 2020  (డి ఎన్ ఎస్): ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ నెల 11 నుంచి శ్రీ స్వామి వారి కేశఖండనశాల తెరవనున్నట్టు దేవాదాయ శాఖ సహాయ కమీషనరు, ఆలయ కార్యనిర్వహణాధికారి వి. హరి సూర్య ప్రకాష్

ప్రకటించారు. సోమవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్, పి. నల్లనయ్య తో కలిసి ఆలయ పరిసరాలు, కేశఖండల శాలలను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కచ్చితంగా కోవిడ్ -19 నిబంధనలు పాటించాల్సిందిగా దేవాలయ  క్షురకులను ఆదేశించారు. దేవాలయ కేశఖండనశాల లో ప్రతి ఒక్క క్షురకులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ వచ్చిన

భక్తులకు కేశఖండన చేయాలని సూచించారు. ప్రత్యేక భద్రతా గౌన్లు, కత్తెరలను క్షురకులకు   అందజేశారు. కేశఖండనశాలలో భక్తుల గురించి వేడి నీళ్ల కోసం ఏర్పాటు చేసినటువంటి గీజర్ ను కమిషనర్ పరిశీలించారు.  

కోవిడ్ కష్టకాలంలో పలుమార్లు ఆలయం లో భక్తులకు దర్శనాలను నిలిపివేయడం జరిగిందని, ప్రస్తుతం అత్యంత కట్టుదిట్టమైన

రక్షణ చర్యలు అమలు చేస్తున్నట్టు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సూపర్డెంట్ డి. వి.వి. ప్రసాద్ రావు , ఆలయ సూపర్డెంట్ బి. ఎస్. చక్రవర్తి పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam