DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్ని రాష్ట్రాల్లోనూ. . . రిపబ్లిక్ ఛానెల్ ప్రారంభిస్తాం: ఆర్నాబ్ 

*రానున్న 17 నెలల్లో దేశవ్యాప్తంగా నెట్ వర్కు మొదలు. . .* 

*చేతనైతే ఆపుకో, ఉద్దవ్ ఠాక్రేకు ఆర్ణాబ్ గోస్వామి సవాల్. .* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 11, 2020  (డి ఎన్ ఎస్):* పత్రికారంగం పై జులుం చూపిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, రానున్న17 నెలల్లో దేశ

వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్ ఛానెల్స్ ను ప్రారంభిస్తామని, చేతనైతే ఆపుకోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రిపబ్లిక్ ఛానెల్ సీఈఓ ఆర్నాబ్ గోస్వామి సవాల్ విసిరారు. సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్ పై తలోజా జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన స్టూడియో కు చేరుకున్నారు. ఈ సందర్బంగా దేశ ప్రజలనుద్దేశించి

ధన్యవాదాలు తెలియచేసారు. మహారాష్ట్ర ప్రభుత్వం తన ను అడ్డుకునేందుకు చేసిన విశ్వ ప్రయత్నాల్లో పదోవంతు మహారాష్ట్ర అభివృద్ధి కి కృషి చేసి ఉంటె రాష్ట్రం పురోగతిలో ఉండేదన్నారు. కోర్టు ఏనాడో కొట్టేసిన కేసును తిరిగి తోడి, తనను 8 రోజుల పాటు జైల్లో ఉంచారని, అత్యంత క్రూరాతి కృతులైన ఉగ్రవాదుల ను ఉంచే తలోజా జైల్లో నరకం

చూపించారన్నారు. అయితే తనకు దేశ ప్రజల మద్దతు ఉందని, వారందరి కి కృతజ్ఞత చూపించాల్సి ఉందన్నారు. దీనికి ప్రతిగా రానున్న 17 నెలల్లో ప్రతి రాష్ట్రంలో నూ రిపబ్లిక్ స్థానిక భాషల్లో ఛానెలు ను ప్రారంభిస్తుందన్నారు. సుప్రీం కోర్టు కు ధన్యవాదాలు తెలియచేసారు. ఒక పాత్రికేయునికి ఉన్న పరిధి తమ బృందానికి తెలుసునని, తాము ఎన్నడూ గతి

తప్పలేదన్నారు. దేశ గౌరవమే తమకు ప్రధానమని, వ్యక్తిగత అంశాలు పట్టించుకోమన్నారు. 
అంతకు ముందు తలోజా జైలు నుంచి బయటకు వచ్చిన ఆర్నాబ్ కు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో ప్రజలు రావడం తో ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం నేరుగా ఆయన రిపబ్లిక్ స్టూడియో కు చేరుకున్నారు అక్కడ ఛానెల్ మొత్తం సిబ్బంది అత్యంత ఘన స్వాగతం

పలికారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam