DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏఓబీ లో మావోల భారీ డంప్, ఒడిశా పోలీసులు స్వాధీనం

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 12, 2020  (డి ఎన్ ఎస్):* ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో  మావోయిస్టుల‌కు చెందిన డంప్‌ను గురువారం  ఒడిశా పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా పోలీసుల‌కు అందిన ముంద‌స్తు స‌మాచారం ప్ర‌కారం మ‌ల్క‌న్‌గిరి జిల్లా

క‌టాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని అర‌ప‌ద‌ర్‌-ఆండ్రాప‌ల్లి అట‌వీప్రాంతంలో గాలింపు చ‌ర్య‌ల‌ను నిర్వ‌హిస్తున్న బీఎస్ఎఫ్  మ‌రియు ఒడిశా పోలీసుల‌కు మావోయిస్టులు దాచిఉంచిన  డంప్‌ను  క‌నుక్కున్నారు.  

ఈ  డంప్‌లో రెండు మందుపాత‌ర‌లు, 14 హ్యాండ్ గ్రైనెడ్‌లు,13

ఎల‌క్ట్రిక్ డిటోనేట‌ర్స్‌,  9 ఎంఎం పిస్ట‌ల్ కు చెందిన 55  రౌండ్స్‌, 303 తుపాకీ చెందిన 93 రౌండ్స్   ఉన్న‌ట్లు ఒడిశా మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు.  

ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీకు చెందిన మావోయిస్టులకు చెందిన సామాగ్రీగా గుర్తించామ‌ని , వీటిని అమాయ‌కులైన గిరిజ‌నుల‌ను

ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో బాటు గాలింపుకు వ‌చ్చే బ‌ల‌గాల‌ను లక్ష్యంగా చేసుకుని వీటిని వాడ‌టానికి దాచిపెట్టార‌ని మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam