DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవిత్రమైన గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలి

*ఏపీ బ్రాహ్మణా కార్పొరేషన్ స్కీంలు పునురుద్ధరించాలి* 

*ఏపీ బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక సమావేశం లో తీర్మానం*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 12, 2020  (డి ఎన్ ఎస్):* సమాజం ఉన్నత స్థితికి చేరుకోవాలంటే. . . అత్యంత పవిత్రమైన గోమాతను జాతీయ జంతువుగా

గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల ఐక్య కార్యాచరణ జాయింట్ యాక్షన్ కమిటీ( జె ఏ సి) డిమాండ్ చేసింది. 

సనాతన బ్రాహ్మణ సంఘాలు సంఘటితం కావాలని కోరుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు వేసిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల ఐక్య కార్యాచరణ జాయింట్ యాక్షన్ కమిటీ( జె ఏ సి) సమావేశం గురువారం సింహాచలం లో జరిగింది. ఈ

సందర్భంగా జేఏసీ కన్వీనర్ సత్యవాడ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. గోవధ దేశవ్యాప్తంగా నిషేధించి, గోవులను పరిరక్షించాలని కోరారు. అదే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ సంబంధించిన పథకాలు యధావిధిగా కొనసాగించాలని అర్హులైన వారికి భారతి స్కీమ్ నగదు వారి అకౌంట్లో జమ చేయాలని

విజ్ఞప్తి చేశారు. 

బ్రాహ్మణ సంఘటితంగా సమస్యను పరిష్కరించుకోవాలని తీర్మానం చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకం లో భాగంగా బ్రాహ్మణ మహిళలు కూడా అవకాశం కల్పించాలని కోరారు. 

అదే విధంగా రాష్ట్ర

ప్రభుత్వం నియమిస్తున్నపలు సంస్థల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణులకు సీట్లు కేటాయించాలని కోరారు. 

సమావేశం కన్వీనర్ ఎం ఎల్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణులు అందరూ ఏకతాటిపై నిలవాలని సంఘాలు ఒకే బాట పై ఉండాలని నినాదంతో జేఏసీ ఏర్పాటు చేయడం

జరిగిందన్నారు రాష్ట్ర అర్చక పురోహిత సమాఖ్య ప్రతినిధులు రంగబాబు మాట్లాడుతూ అర్చకుల సమస్యలపై పూర్తిస్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు ఈ సమావేశంలో ఏ ఐ బి ఎఫ్ ప్రతినిధులు ఏపీ ఎస్ ఎస్ ఎస్ ప్రతినిధులు కోనూరు సతీష్ శర్మ మహిళా ప్రతినిధులు కె

నాగలక్ష్మి .ఏ బి బి ఎం, ఐ బి పి పి వి కె బి పి ఎస్ ఎస్ ఎస్ ప్రతినిధులతో పాటు విశాఖ విజయనగరం జిల్లాల నుంచి  సమాఖ్య ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam