DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిజిపి వయో నిబంధనలే సిఎస్‍గా వచ్చేవారికి కూడా. .వర్తించేలా

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 13, 2020  (డి ఎన్ ఎస్):* రాష్ట్ర డిజిపిని నియమించేటప్పుడు ఆయనకు సర్వీసు తక్కువగా ఉన్నప్పటికీ.. నియామకం జరిగాక.. తప్పనిసరిగా రెండేళ్లు కొనసాగించే విధంగా.. ఏ విధంగా ఉత్తర్వులు ఉన్నాయో.. అదే ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ముందు ముందు

నియమింపబడే వారికి వర్తింపు అయ్యే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం. ఉదాహరణకు డిజిపిగా నియమించిన ఐపిఎస్‍ అధికారికి ఆరు నెలలు సర్వీసు ఉన్నా.. రెండేళ్ల వరకు ఆ పోస్టులో కొనసాగవచ్చుననే నిబందనలు ఎలా ఉన్నాయో.. అవే నిబందనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో నియమించిన వారికి కూడా

వర్తించే విధంగా కేంద్రం నిబందనలు జారీ చేయబోతుంది. ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్కువ కాలం పనిచేసి రిటైర్డు అవుతున్నారు. వారికి మరో ఆరు నెలలు సర్వీసు పొడిగించాలని కేంద్రానికి అనుమతి కోరుతూ లేఖ రాస్తున్నారు. ఒత్తిళ్లు కూడా తెస్తున్నారు. ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర

మోడీ తన కార్యాలయ అధికారులతో, ఇతర ముఖ్యులతో చర్చించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో నియమింప పడేవారు.. రెండేళ్లు తప్పనిసరిగా పోస్టులో ఉండే విధంగా ఇంతకు ముందు ఉన్న నిబందనలలో మార్పులు చేస్తే.. నష్టం ఏమిటి అని చర్చించినట్లు తెలిసింది. 2020 డిసెంబరు మాసాంతంలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమింపపడే వారికి

సర్వీసు తక్కువగా ఉన్నా.. రెండేళ్లు పదవిలో కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా నియమింపపడే వారి సర్వీసు తక్కువగా ఉన్నా.. వారు కూడా రెండేళ్ల పాటు సర్వీసులో కొనసాగుతారు. ఆ విధంగా కొనసాగే నిబందననే రాష్ట్ర డిజిపిలకు వర్తింప చేసిన కేంద్రం తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా

నియమింపపడే వారికి కూడా అదే ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు అధికార వర్గాల సమాచారం

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam