DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక్క లేఖతో 18 న 23 దేవాదాయ శాఖ ఆలయాల్లో పీఠాధిపతి పేరిట పూజలా?

*దేవాదాయ శాఖ గుళ్ళల్లో ఏ హోదాలో పూజకు ఆదేశాచ్చారు?*

*లేఖలు ఇస్తే ఎవరికయినా ఆలయాల్లో మర్యాద చేస్తారా?*

*జనసేన నాయకులూ పీతల మూర్తి యాదవ్ డిమాండ్* 

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 13, 2020  (డి ఎన్ ఎస్):*  రాష్ట్ర దేవాదాయ శాఖలో

జరుగుతున్న ఇష్టానుసార అడ్డగోలు వ్యవహారాల జాబితా లో మరి లెక్క చేరింది. ఈ నెల 18 న విశాఖ లోని ఓ పీఠాధిపతి జన్మదినం పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 23 ప్రఖ్యాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అధికార మర్యాద చెయ్యాలంటూ దేవాదాయశాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. అసలు ఏ హోదా లో ఈ పీఠాధిపతి ప్రత్యేక మర్యాద పూజలు

జరుపుతున్నారో బహిర్గతం చెయ్యాలని జనసేన సీనియర్ నాయకులూ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. 

ఏ దేవాలయానికైనా పీఠాధిపతులు వెళ్లిన సమయాల్లో సైతం కేవలం స్వాగతం మాత్రమే పలకడం జరుగుతుంది, అంతే తప్ప ఆలయాల్లో ప్రత్యేక వ్యక్తిగత పూజలు చెయ్యడం చాలా అరుదు. అయితే ఈనెల 18 న ఈ పీఠాధిపతుల జన్మదిన పురస్కరించుకుని

ఆశ్రమం వారు దరఖాస్తు చేసుకోవడం లో ఎటువంటి అభ్యన్తరం లేదన్నారు. అయితే దేవాదాయ శాఖ అభ్యంతరం చెప్పవచ్చు. ఈయన ప్రసన్నం ఎప్పుడు లభిస్తుందా అంటూ ఎదురుచూస్తున్న దేవాదాయ శాఖ కు ఈ నెల 18 న జాక్ పాట్ లాంటి ఆఫర్ తగిలింది అని చెప్పాలి. దీంతో ఒకే వాక్యంతో మొత్తం 23 దేవాలయాలకూ ఆదేశాలిచేశారన్నారు.

అదనపు కమిషనర్ రామచంద్ర

మోహన్ పేరిట విడుదలైన ఈ లేఖలో ఇచ్చిన వివరాల ప్రకారం శ్రీకాకుళం లోని అరసవల్లి సూర్య దేవాలయం, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం, రామతీర్ధం, విశాఖపట్నంలోని సింహాచలం,  శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం, తూగో జిల్లా అన్నవరం, అంతర్వేది, పగో జిల్లా ద్వారకా తిరుమల,  మనోళ్ళమ్మ ఆలయం, విజయవాడ కనకదుర్గ, గుంటూరు లో మంగళగిరి, కొత్తపుకొండ,

ప్రకాశం త్రిపురాంతకం, నెల్లూరు రంగనాధ స్వామి ఆలయం, కాళహస్తి, కాణిపాకం, గండి, దేవుని గడప, శ్రీశైలం, మహానంది, అహోబిలం, కదిరి, కసాపురం ఆలయాల్లో ఈ పీఠాధిపతి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించాలి అని ఆదేశాలు ఉన్నాయన్నారు.

కేవలం ఒక్క లేఖ ద్వారా ఆశ్రమ నిర్వాహకులు దేవాదాయ శాఖకు పెట్టుకున్న అర్జీ తో దేవాదాయ శాఖా

యంత్రాంగం మొత్తం కదిలిపోయింది. తక్షణం స్వామి భక్తిని నిరూపించుకునే అవకాశం వచ్చింది అని దాసోహమైపోయిందన్నారు.

ఇదే వేరే పీఠాధిపతులు గానీ, సామాన్యులు గానీ లేఖ వ్రాస్తే. . .దేవాదాయ శాఖా ఇదే విధంగా స్పందిస్తుందా అంటూ మూర్తి యాదవ్  ప్రశ్నిస్తున్నారు. 

కొన్ని దేవాలయాల్లో వ్యక్తిగత పూజలు చెయ్యడం

పూర్తిగా నిషేధం. వాటిల్లో కూడా పూజలు చెయ్యాలి అంటూ అదేశాలివ్వడం వివాదాస్పదంగా మారింది. భక్తుల నుంచి వచ్చే ప్రశ్నలకు దేవాదాయ శాఖ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam