DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తుంగభద్రా పుష్కరాల్లో పిండ ప్రధానం ఒకే, పుణ్య స్నానాల పైనే వేటు

*తుంగభద్రా పుష్కరాల్లో అధికారుల ఆదేశాలు.* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 17, 2020  (డి ఎన్ ఎస్):* ఈ నెల 20 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పవిత్ర తుంగభద్రా నది పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భక్తులకు పుణ్యస్నానాలకు అనుమతి లేదని, కేవలం పూజలు, పిండప్రదానాలు మాత్రమే

అనుమతి ఉందని కర్నూల్ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 20 తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్ బాగ్ పుష్కర ఘాట్ లో పవిత్ర తుంగభద్రా నది పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్కరాలకు కర్నూలు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ

ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆదేశించారు.

స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా రాకపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఈ టికెట్ లేకుండానే

సాంప్రదాయ పూజలు, పిండప్రదానాలు చేసుకోవచ్చని తెలిపారు. పవిత్ర తుంగభద్రా నది పుష్కరాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 20 తేదీన వస్తున్నందున ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

ఈ మేరకు సంబంధిత

ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పెండింగ్లో ఉన్న వర్కు లన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. హెలిప్యాడ్ నుండి సీఎం వెళ్లే రహదారి పొడవునా ప్రతి 100 మీటర్లకు ఒక అధికారిని నియమించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు

తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల పరిధిలో వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. హెలిప్యాడ్, బారికేడ్లు, అగ్నిమాపక వాహనం ఏర్పాటు, భద్రతా సౌకర్యం, పార్కింగ్, ప్రోటోకాల్, సేఫ్ రూమ్ సౌకర్యం, విద్యుత్ సరఫరా, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం కల్పన తదితర

అన్ని రకాల ఏర్పాట్లు సక్రమంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ ఎటువంటి తప్పులు దొర్లకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే వెంటనే జనరేటర్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన లో జెడ్ ప్లస్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాఫిక్ అంతరాయం

లేకుండా చూడాలని పోలీసులకు ఆదేశించారు. టీములుగా ఏర్పడి అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి కాన్వాయ్, సేఫ్ రూమ్, చికిత్సాపరమైన మందులు ఏర్పాటు చేయడంతోపాటు అంబులెన్స్ కాన్వాయ్ వెంట ఉండేలా చూడాలన్నారు. పాత్రికేయులకు ప్రెస్ పాసులను ఇవ్వాలని ఉపసంచాలకులు పౌర సంబంధాల శాఖ అధికారికి

ఆదేశించారు. శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి కె బాలాజీను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు సూచించారు.

ఈ సమీక్షలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ, అభివృద్ధి)  రామ సుందర్ రెడ్డి,  జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)

సయ్యద్ ఖాజామోహిద్దీన్, నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె. బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, డి ఆర్ ఓ పుల్లయ్య, ఆర్ డి ఓ లు, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఆర్డిఎ పిడి శ్రీనివాసులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam