DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్నానాలకు అనుమతే లేని పుష్కరాల్లో టికెట్లు అవసరమా?

*దేవాదాయ శాఖా వసూళ్ల పైత్యం ముదిరి పాకాన పడింది.* 

*తుంగభద్రా పుష్కరాల్లో భక్తుల నుంచి వసూళ్ల కి పకడ్బందీ ఏర్పాట్లు* 

*డబ్బులు కట్టేది ప్రభుత్వానికి, పూజ సామాను తేవాల్సింది భక్తుల?*

*టికెట్ వసూళ్లలో బ్రాహ్మణులకు ముట్టడి ఎంత?* 

*వసూళ్ల పై జనసేన నేత పీతల మూర్తి యాదవ్

మండిపాటు.* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 20, 2020  (డి ఎన్ ఎస్):* రాష్ట్రంలో జరుగుతున్నా తుంగభద్ర నదీ పుష్కరాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖా తీరుపై సర్వత్రా నిరసనలు వెల్లువవుతున్నాయి. పుష్కర ఘాట్ లోకి భక్తులు అడుగుపెట్టాలంటే కచ్చితంగా ఆన్ లైన్ లో టికెట్

తీసుకోవాలని, అయితే భక్తులకు స్నానాలకు అనుమతి లేకపోవడం పై జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ మండిపడుతున్నారు. 
పుణ్య స్నానాలకు అనుమతే లేని పుష్కరాలకు టికెట్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. 
పిండ ప్రదానానికి రూ. 350 టికెట్ పెట్టడం ఏంటని, భక్తుల నుంచి బలవంతంగా వసూళ్లు   చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ఆవేదన

వ్యక్తం చేసారు.  భక్తులకు పుష్కర ఘాట్లలో స్నానాలు చేసేందుకు అనుమతి లేవని, ఘాట్ల బయట కేవలం జల్లు స్నానం మాత్రమే ఉంటుందని దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి చేసిన ప్రకటన హిందువుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బయట పడిందన్నారు. 

పైగా ఇతర రాష్ట్రాల్లో స్నాన ఘాట్ ల్లో స్నానాలు యధావిధిగా ఉన్నాయని, అయితే ఎక్కడా

టికెట్ విధానం లేదని, కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే దీనికి విరుద్ధంగా ఉందన్నారు. భక్తులకు స్నానాలకు అనుమతి లేదని, టికెట్లు మాత్రం పెట్టి లక్షలాది భక్తులను ముంచుతున్నారన్నారు. 
భారీ ఎత్తున టికెట్ ల ధరలను ప్రభుత్వం ధరల పట్టిక ద్వారా పోస్టర్లతో ప్రదర్శిస్తున్నారన్నారు. వీటిలో విధించిన ధరల వివరాలు ఇవే :

మహా

సంకల్పం : రూ. 200 
మూసి వాయసం : రూ. 250  
పిండ ప్రధానం : రూ. 350 
పితృ తర్పణం : రూ. 200 
స్వయంపాకం: రూ. 250 
లవణ దానం: రూ. 50 
సంకల్ప శ్రాద్ధం : రూ. 100 
సంకల్ప స్నానం : రూ. 30 
గౌరీ పూజ : రూ. 30 

భారీ మొత్తం లో టికెట్లు వసూళ్లు చేస్తున్న దేవాదాయ శాఖా ఈ టికెట్లలో కార్యక్రమం జరిపించిన బ్రాహ్మణులకు ఇచ్చే సభావన /

డబ్బులు ఎంత ఉంటాయో చెప్పకపోవడం చూస్తే. . భక్తులను దోపిడీ చేయడమేనని మూర్తి మండిపడ్డారు. బ్రాహ్మణుల పేరు చెప్పి భక్తుల నిధులు కొల్లగొట్టడమేనన్నారు. దీనిపై బ్రాహ్మణా సంఘాలు ప్రశ్నించాలన్నారు. 

కార్యక్రమం జరిపించుకున్న భక్తులు తమకు తోచిన సంభావన పురోహితులకు ఇవ్వడం ఆనవాయితీ అని, అయితే ప్రభుత్వం బలవంతం

వసూలు చేసి, బ్రాహ్మణులకు టోకరా వెయ్యడాన్ని భక్తులు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. పైగా టికెట్ డబ్బులు వాసులు చేస్తున్న దేవాదాయ శాఖ భక్తులకు ఎటువంటి సదుపాయాలు చెయ్యడం లేదని, పూజ సామాగ్రి భక్తులే తెచ్చుకోవాలనడం చూస్తే వసూళ్ల వ్యవహారం బయటపడుతోందన్నారు.  

ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం రాష్ట్రంలో 23 ఘాట్లను

ఏర్పాటు చేసారు. కర్నూల్ లో 7 , మంత్రాలయం లో  8, కోడుమూరు  లో  5, ఎమ్మిగనూరు  లో  2, నందికొట్కూరు  లో  1, ఘాట్లు ఏర్పాటు చేసారు. 

తుంగభద్ర నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. 

తెలంగాణ లో అలంపూర్, వేణి సోంపూర్ , రాజోలి, పుల్లూరు , కలుగొట్ల ప్రాంతాల్లో ఘాట్లు

ఉన్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam