DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖలో లీజు ముగిసిన ప్రత్యర్థి స్థలాలపై కొరడా అమలు

  *(DNS రిపోర్ట్: సత్యగణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 21, 2020  (డి ఎన్ ఎస్):* లీజు గడువు ముగిసిన స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు విశాఖలో అధికారులు ఆఘమేఘాలపై పరుగులు తీస్తున్నారు. విశాఖ ను కార్యనిర్వాహక రాజధాని గా ప్రకటించడంతో ప్రభుత్వ అధీనంలో ఎంత భూమి ఉంది అనే విషయం తెలుసుకునే

ప్రయత్నంలో అధికారులు క్షేత్ర స్థాయిలో పూర్తి కార్యాచరణ సిద్ధం చేసేసారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కి చెందిన వ్యాపారవేత్తల అధీనంలో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం లో రాత్రి పగలు తెగ కష్టపడుతోంది అధికార యంత్రాంగం. దీని లో భాగంగానే గత వారం టీడీపీ సానుభూతి పరుడికి ఇచ్చిన లీజు ముగిసింది అంటూ విశాఖ మెట్రో

అభివృద్ధి సంస్థ ( వి ఎం ఆర్ డి ఏ) గురజాడ కళాక్షేత్రం ప్రక్కనే ఉన్న ఫుజన్ ఫుడ్సు ను స్వాధీనం చేసుకోగా శనివారం మంగమారి పేట ( భీమిలి ) బీచ్ రోడ్ లోని ఓ సంస్థ లీజు ముగిసింది అని స్వాధీనం చేసుకునేందుకు భారీ మొత్తంలో జివిఎంసి ( మహా విశాఖ నగర పాలక సంస్థ), రెవిన్యూ అధికారుల యంత్రాంగం చేరుకుంది. ప్రస్తుతం ఈ భూమి లీజు తెలుగుదేశం

పార్టీ కి చెందిన కాశీనాధ్ పేరిట ఉంది. వైజాగ్ ప్రొఫైల్స్ నుండి పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. 
ఇతను మాజీ మంత్రి గంట శ్రీనివాస రావు కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. లీజు గడువు ఇంకా ఉంది అంటూ నిర్వాహకులు చెప్పినప్పటికీ స్థలం లో ఉన్న నిర్మాణాలను కూల్చేసి, స్థలం ను స్వాధీనం చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం

చేస్తున్నారు. అయితే అధికారులు కాశీ విశ్వనాథ్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నారు. సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారుంటూ తొలగిస్తున్నారు.
ఇది పూర్తిగా ప్రైవేటు భూమని, ప్రభుత్వానికి సంబంధం లేదని కాశీ విశ్వనాథ్ అంటున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam