DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంప్రదాయాలను తుంగలోకి తొక్కుతూ పుష్కర నిబంధనలా?

*పుష్కరాల్లో స్నానం లేకుండా పిండ ప్రదానాలా?*

*అడ్డొకోవాల్సిన పురోహితులు కూడా పద్ధతులకు నీళ్లు వదిలేశారా?* 

*ఘాట్ ల వద్ద నీటి కట్టడి, జల్లుకోడానికి కూడా నీళ్లు లేక ఇక్కట్ల లో భక్తులు*

*జల్లు బాత్ తర్వాత వీళ్ళు మినరల్ వాటర్ తో స్నానం? . ..*  

*తుంగ పుష్కరాలపై జనసేన నేత పీతల

మూర్తి యాదవ్ మండిపాటు* 

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 21, 2020  (డి ఎన్ ఎస్):* హిందూ ధార్మిక సంప్రదాయాలను తుంగలోకి తొక్కుతూ తుంగభద్ర పుష్కరాల్లో నిబంధనలు పెట్టడాన్ని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ మండిపడుతున్నారు. కోవిడ్ అనే భూతాన్ని చూపిస్తూ. .

తుంగభద్ర లో భక్తులు పుణ్య స్నానాలు చేయడాన్ని ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖా పూర్తిగా నిషేదించిందన్నారు. అయితే ఘాట్ దగ్గరకి వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ప్రభుత్వ నిర్దేశిత టికెట్ కొనాల్సిందేనన్నారు. సాధారణంగా భక్తులు పుష్కరాలకు వచ్చేది తమ పెద్దలకు పిండ ప్రదానం చెయ్యడానికేనన్నారు. అయితే పిండ ప్రదానం అనేది

హిందూ ధార్మిక సంప్రదాయం లో అత్యంత పవిత్రమన్నారు. దీనికి కచ్చితంగా నది స్నానం చేయాలన్నారు. ప్రస్తుతం తుంగభద్ర పుష్కరాల్లో స్నానాలకు అనుమతి లేదు అని చెప్తున్నా ప్రభుత్వం, పిండ ప్రదానాలు టికెట్లు ఎలా పెట్టిందన్నారు. భక్తులు కేవలం నీళ్లు జల్లుకోవడమే తప్ప స్నానం చెయ్యకూడదని నిబంధన ఉందన్నారు. 

*పురోహితులు

కూడా చేతులెత్తేసారా?*

సంప్రదాయాన్ని భక్తులతో జరిపించవలసిన పురోహిత శ్రేష్ఠులు సైతం నది స్నానం గురించిన ప్రాధాన్యతలను అధికారులు, మంత్రికి వివరించలేక పోయారా అని ప్రశ్నించారు.  పిండ ప్రధానం చెయ్యవలసిన భక్తులతో నది స్నానం చేయించిన తర్వాతే పిండ కార్యక్రమం జరిపించవలసి ఉంటుంది. ఈ విషయాన్నీ పూర్తిగా

విస్మరించినట్టు కనిపిస్తోందన్నారు. నీళ్లు జల్లుకుంటే సరిపోయేదానికి నది దగ్గరకి వచ్చి మరీ పిండ ప్రధానం చెయ్యడం లో అర్ధం ఏంటని ప్రశ్నించారు. 

*హిందూ ధర్మాన్ని తుంగలోకి తొక్కే ప్రయత్నం . . .* 

రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్నా దాడులు నేపథ్యంలో హిందూ సంప్రదాయాల పట్ల మరింత శ్రద్ధ వహించవలసిన

ప్రభుత్వం, దేవాదాయ శాఖ తీరు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా తుంగభద్ర పుష్కరాల్లో ప్రభుత్వం వైఖరి ఉందన్నారు.

*ఘాట్ ల వద్ద నీటి కట్టడి, ఇక్కట్లలో భక్తులు . . . . .* 

సుంకేశుల ఎగువన 5 వేల క్యూసెక్కులు నీటి ప్రవాహం ఉందని, అయితే సుంకేశుల దిగువున కేవలం 4 వేలు క్యూసెక్కుల

నీటి ప్రవాహం వస్తోందన్నారు. నీటి ప్రవాహాన్ని అధికారులు కట్టడి చేసినందు వల్లే.. ఘాట్ ల వద్ద జల్లు కోడానికి కూడా నీళ్లు రావడం లేదని భక్తుల ఆవేదన చెందుతున్నారన్నారు. షవర్ల క్రింద మురుగు నీటితోనే భక్తులు స్నానం చెయ్యవలసిన స్థితి నెలకొందన్నారు. షవర్ బాత్ తర్వాత వీళ్ళు మినరల్ వాటర్ తో స్నానం చెయ్యాల్సిన పరిస్థితి కూడా

నెలకొందన్నారు. తక్షణం పూర్తి స్థాయి లో ఎగువ నీటిని వదలాలని డిమాండ్ చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam