DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధర్మ శాస్త్రం తెలిసిన అధికారే పురోహితునిగా సేవలు

*మంత్రం చదివి  భక్తులచే పిండ ప్రదాన క్రియలు.*

*శాస్త్ర విరుద్ధంగా చెయ్యలేక తుంగ పుష్కరాల్లో పురోహితులు రాక. .* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 23, 2020  (డి ఎన్ ఎస్):* ప్రస్తుతం జరుగుతున్న తుంగభద్రా పుష్కరాల్లో ధర్మ శాస్త్రానికి విరుద్ధంగా రాష్ట్ర

ప్రభుత్వం నిబంధనలు విధించడం తో 
కొన్ని ఘాట్ ల వద్ద పురోహితులు హాజరు కావడం లేదు. ఈ క్రమం లో పుష్కరాల్లో పిండప్రదానం చేసి పితృదేవతలను తరిమ్పచేద్దామనే సంకల్పంతో ఘాట్లకు వచ్చిన భక్తులకు అన్ని రకాలుగానూ చుక్కలు ఎదురవుతున్నాయి. ప్రధానం గా నది లో స్నానం చెయ్యకూడదు అని నిషేధాజ్ఞలు రాష్ట్ర ప్రభుత్వం విధించడంతో

భక్తులు వెనుదిరుగుతున్నారు. ఏదో మమ అనిపిద్దామని వచ్చిన వారికి కూడా సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదే తీరులో. . . కర్ణాటక నుంచి వచ్చిన భక్తులకు విశేషమైన అనుభవం కల్గింది. పురోహితులు లేకపోవడంతో బాధపడుతున్న వీరికి ఒక బ్రాహ్మణా అధికారి స్వయంగా మంత్రం చదివి పిండ ప్రధానం చేయించారు. వివరాల్లోకి వెళితే. .

.

రెండో రోజు పుష్కరాలకు కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి నలుగురు అన్నదమ్ములు మంత్రాలయం మండలంలోని రాంపురం ఘాట్‌కు శనివారం వచ్చారు. గతించిన తమ తండ్రికి పిండ ప్రదానం పెట్టడానికి పురోహితుల కోసం రెండు గంటలకు పైగా ఎదురుచూశారు. పుష్కరాలకు వచ్చి పిండ ప్రదానం చేయకుండా వెనుదిరగాల్సి వస్తుందని బాధ పడ్డారు. నిరాశతో

ఉన్న ఆ భక్తులను అక్కడే ఘాట్‌ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న నంద్యాలలోని ఆంజనేయస్వామి ఆలయ ఈవో రామాంజనేయ శర్మ గమనించారు. ఆయన పురోహితుడిగా అవతారమెత్తి దగ్గరుండి సంప్రదాయ బద్ధంగా పిండ ప్రదాన పూజలు చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన ఆ నలుగురు అన్నదమ్ములు ఆ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. 

అయితే

పిండప్రదానం కు ముందుగా నది స్నానం చెయ్యవలసిన అవసరం ఉండడంతో. . ప్రభుత్వ నిషేధాజ్ఞలు క్రమంలో కేవలం నీళ్లు జల్లుకుని కార్యక్రమం జరిపించడం కొసమెరుపు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam