DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరెస్టు అయితే అయ్యారు. . తుంగభద్ర లో పుష్కర స్నానం చేసేసారు

*తుంగ భద్రలో స్నానం చేసిన బీజేపీ బైరెడ్డి శబరీ బృందం అరెస్ట్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 23, 2020  (డి ఎన్ ఎస్):* ప్రస్తుతం తుంగభద్రా పుష్కరాల్లో పుణ్య నదీ స్నానం చెయ్యడం పై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో విభేదిస్తూ కర్నూల్ బీజేపీ

శ్రేణులు స్నానం చెయ్యడం తో పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్టు అయితే అయ్యారు. . . మొత్తానికి వీళ్ళొక్కళ్ళే తుంగభద్రా నదిలో పుష్కరాల సమయంలో నదీ పుణ్య స్నానం చేయగలిగారు, పవిత్రులు కాగలిగారు అని అందరూ అభిప్రాయపడుతున్నారు.

కర్నూల్ కు చెందిన బీజేపీ యువనేత బైరెడ్డి శబరీ రెడ్డి నేతృత్వం పలువురు బీజేపీ

కార్యకర్తలు సంగమేశ్వరంలో పవిత్ర తుంగభద్ర పుష్కర స్నానాన్ని ఆచరించారు. దీంతో వీరాగ్రహం చెందిన పోలీసులు బైరెడ్డి శబరిని పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వాహనం ఎక్కించి కొత్తపల్లె పోలీసు స్టేషన్ కు తరలించారు.  పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం..  కచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

అన్నారు. 

వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పుష్కర స్నానాలకు అనుమతి నిరాకరించడంతో “ఛలో తుంగభద్ర” కార్యక్రమం చేపట్టినట్టు శబరి ప్రకటించి, పుష్కర స్నానాన్ని ఆచరించారు. 12ఏళ్ల కొకసారి జరిగే పవిత్ర పుష్కర స్నానాలను ఆచరించడం నేరమా.? అని ప్రశ్నించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam