DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భర్త రెండో పెళ్లితో భార్య, పిల్లలు సహా నల్గురు ఆత్మహత్య

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 23, 2020  (డి ఎన్ ఎస్):* ఒక వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్య, ఆమె తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన రాజ మహేంద్ర వరం లో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రిలోని రామాలయం వీధి, అంబేద్కర్ నగర్ కాలనీలో

విజయవాడకు చెందిన తన భర్త నాగేంద్ర కుమార్ తిరిగి వివాహం చేసుకున్నాడని కలత చెందడంతో భార్య తన కుమార్తె, కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సోమవారం జరిగిన ఈ విషాద సంఘటన లో సంగిశెట్టి కృష్ణవేణి (55), భూపతి శివపవని (27) నిషాన్ (9), రితా (7) లు ఆత్మహత్యకు పాల్పడినట్టు గా గుర్తించారు. ఈ సంఘటనతో రాజమండ్రి ప్రజలు ఆగ్రహం

వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ నగర్ లోని రామాలయం వీధిలో విషాద నీడలు పడిపోయాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam