DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీసీ గా ఎయు ప్రసాదం దక్కింది ప్రసాద్ రెడ్డి కే

ఏపీ లో  నాలుగు వర్సిటీలకు వీసీ ల నియామకం. 

ఎయు కు ప్రసాద్ రెడ్డి, తిరుపతి కి రాజా రెడ్డి. .

వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుల్లో కీలకం వీరే   

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 25, 2020  (డి ఎన్ ఎస్):* గత కొంతకాలం గా ఇంచార్జిల పాలనలో ఉన్న

విశ్వవిద్యాలయాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి ఉపకులపతుల నియామకం చేసింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కు డాక్టర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి ని వీసీ గా నియమించింది. శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి డాక్టర్ కే రాజారెడ్డి (ఎస్వీ  రిటైర్డ్ అధ్యాపకులు) ని విసి గా

నియమించింది. 

ప్రస్తుతం పివిజిడి ప్రసాద్ రెడ్డి ఎయు కు ఇంచార్జి వీసీగా సేవలందిస్తున్నారు. గతం లో వీరు ఎయు రెక్టార్ గాను, రిజిస్ట్రార్ గా సైతం ఎంతో విలువైన సేవలను అందించారు. 
ఎయులోని కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్ సీనియర్ అధ్యాపకులుగా ఉన్న ప్రసాద్ రెడ్డి, ఇదే విశ్వ విద్యాలయం నుంచి ఎం టెక్ పూర్తి చేసి,

ఇదే విద్యాలయం లో అధ్యాపకునిగా గత రెండున్నర దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తున్నారు. ఎందరో విద్యార్థులకు మార్గదర్శిగా, వేలాది మంది ఇతర ప్రాంతాల విద్యార్థులకు సైతం ఉపాధి కల్పించే విధంగా మెగా జాబ్ మేళాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో దేశ, విదేశాల లోని ఎయు పూర్వ విద్యార్థులను

అందరిని ఏకత్రాటిపైకి తీసుకు వచ్చి, ఎయు లోని ఎన్నో విభాగాలను అత్యాధునిక రీతిలో తీర్చిదిద్దెందుకు నిధులను సమీకరించగలిగారు. గత కొన్నేళ్లుగా ఎయు పేరు చెప్పగానే ధర్నాలు, నిరసనలు మాత్రమే వినిపించేవి, అయితే ఎయు లో నేడు, ఆ ఛాయలే కనపడడం లేదు అంటే వీరి కృషి ఎంతో ఉంది. విద్యార్థులతో ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించి, సమస్యల

పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆధునిక పరీక్ష విధానంలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చి, ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలను నిర్వహించడమే కాక, విద్యార్థులకు సైతం ఐటి విధానం పట్ల ఎంతో అవగాహనా కల్పించగలిగారు. 

ఎయు లో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటు కృషి వీరిదే. .

పేద విద్యార్థులు సైతం ఉన్నత సాంకేతిక విద్య

సునాయాసంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎయు లో నెలకొల్పడం లో వీరి కృషి అభినందనీయం. ఆయన్ని ఒక రాజకీయ నేతగా కాక, కోట్లాది మంది ప్రజానీకానికి ఆదర్శమూర్తిగా మాత్రమే చూడాలి అనే సంకల్పంతో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు గతంలో

తెలియచేసారు. 

గతంలోనే జరగాల్సి యుంది. . . .

ఎయు వీసీ గా ప్రసాద్ రెడ్డి నియామకం ఇంతకూ ముందే జరగాల్సి యున్నప్పడికి డాక్టర్ హేమచంద్ర రెడ్డి సైతం బరిలో ఉండడంతో పాటు నియామకం జాప్యం జరిగింది. ప్రసాద్ రెడ్డి నియామకం పట్ల ఎయు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పలువురు హితులు,

సన్నిహితులు అభినందనలు తెలియచేస్తున్నారు.  

జగన్ కు అత్యంత సన్నిహితుల్లో కీలకం వీరే. .. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుల్లో అత్యంత కీలకం ప్రసాద్ రెడ్డేనని ప్రచారం లో ఉంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్య సంస్థల్లో విద్యార్థుల్లో చైతన్యం

కల్గించిన యువ భేరి కార్యక్రమాన్ని ఎయులో నిర్వహించి, ఉత్తరాంధ్ర లో జగన్ ను యువతకు మరింత చేరువ చెయ్యడంలో ప్రసాద్ రెడ్డి కృతకృత్యులయ్యారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam