DNS Media | Latest News, Breaking News And Update In Telugu

75 ఏళ్ళ అంబెడ్కర్ విశాఖ రైలు పర్యటన పై పోస్టల్ కవర్ విడుదల 

*చారిత్రాత్మక సందర్భాల్లో ప్రత్యేక పోస్టల్ కవర్లు విడుదల: సిజిపిఎమ్ వెంకటేశ్వర్లు*  

(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)  

విశాఖపట్నం నవంబర్ 26 2020 (డి ఎన్ ఎస్ ): బి. ఆర్  అంబెద్కర్ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ పర్యటన ప్లాటినం జూబ్లీ ఇయర్ సందర్భంగా “ట్రైన్ క్యారీడ్ స్పెషల్ పోస్టల్

కవర్”  ప్రత్యేక కవర్ ను విడుదల విడుదల చేసారు. గురువారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రాంగణం లో జరిగిన కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ యొక్క చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ లు సంయుక్తంగా ఈ ప్రత్యేక కవర్ విడుదల చేసారు. ఈ సందర్బంగా

డి ఆర్ ఎం మాట్లాడుతూ 1944 న ఈ రోజున అంబేద్కర్ 1944 సంవత్సరంలో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే విశాఖపట్నం నుండి రైలులో తన పర్యటనను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26 న రాజ్యాంగ దివస్ (సంవిధాన్ దివాస్) భారతదేశంలో జరుపుకుంటారన్నారు. 

చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్

డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ సంఘటన మొత్తం దేశానికి విశాఖపట్నంలో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి అద్భుతమైన సందర్భాన్ని గుర్తు చేసుకునే విధంగా పోస్టల్ శాఖా ప్రత్యేక పోస్టల్ కవర్ లను విడుదల చేస్తోందన్నారు. వ్యక్తిగతం గా కూడా పోస్టల్ సేవలు అందుకోవచ్చన్నారు. గత కొన్నేళ్లుగా

ఎన్ను చారిత్రాత్మక సందర్భాల్లో పోస్టల్ విభాగం ప్రత్యేక కవర్లు విడుదల చేసిందన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రతిజ్ఞ సభ్యులందరూ చేసారు. 
ఈ కార్యక్రమంలో సీనియర్ పోస్టాఫీసుల సూపరింటెండెంట్, విశాఖపట్నం జె.ప్రసాద్ బాబు, సీనియర్ అధికారి నాగేశ్వర రావ్, పోస్టల్, రైల్వే, ఆర్‌ఎంఎస్, ఎంఎంఎస్

ఉద్యోగులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam