DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కసబ్ చచ్చి ఉంటె. . హిందూ ఉగ్రవాది అని ముద్ర వేసేవారు 

*26 /11 ఘటన లో నాటి ముంబై పొలిసు త్యాగానికి జోహార్*

*ముంబై మాజీ సీపీ రాకేష్ మారియా పుస్తకంలో భయంకర నిజాలు* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 26, 2020  (డి ఎన్ ఎస్):* 26/11 దాడుల్లో మరణించిన ముంబై ASI మరియు మాజీ సైనికుడు తుకారాం ఓంబ్లీకి హిందూ సమాజం ఎంతో ఋణపడి

ఉంది. నవంబర్ 26 న ముంబై నగరం లో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన విచ్చలవిడి మారణహోమంలో అతను తన ప్రాణాలను పణంగా పెట్టి కసబ్ ని ప్రాణాలతో పట్టుకొని ఉండక పోతే హిందూ సమాజంపై ఉగ్రవాద ముద్ర శాశ్వతంగా పడి ఉండేది. ఈ విషయాన్నీ ఏ సామాన్య పౌరుడో చెప్పలేదు. సాక్షాత్తు నాటి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముంబై మాజీ పోలీసు కమిషనర్

రాకేష్ మారియా రాసిన 'Let me say it Now'  పుస్తకం లో వెల్లడించారు. 

ఆరోజు కసబ్ కానీ హిందువుగా మరణించి ఉండి ఉంటే పాక్ మరియు కాంగ్రెస్ ఎంతో తెలివిగా అల్లిన హిందూ టెర్రర్ పదం ప్రాచుర్యం పొందేది. కసబ్ ప్రాణాలతో దొరికిపోయి హిందూ సమాజానికి ఎంతో మేలు చేసాడు. ఆ రోజు పోలీసు కాల్పుల్లో  కసబ్ హిందువుగా మరణించి ఉండి ఉంటే

కాంగ్రెస్ నాయకులు రాహుల్, శివరాజ్ పాటిల్, చిదంబరం, దిగ్విజయ్ సింగ్ మొ. సీనియర్ నేతలు ప్రచారం కల్పించిన హిందూ టెర్రర్ లేదా కాషాయం టెర్రర్ (saffron terror)  అనే పదం దేశ విదేశ మీడియాలో రోజూ విరివిగా వాడబడుతూ ఉండేది అని తెలిపారు. ఇదే అభిప్రాయం ప్రస్తుతం సామాన్య పౌరుల్లో కూడా.   

ఎందుకంటే కసబ్ చేతికి కాషాయ రంగు దారాలు

కట్టుకున్నాడు. అతని జేబులో హిందూ పేరుతోనే అన్ని ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి. ఈ ఆధారాల బట్టి ఆ చనిపోయిన వ్యక్తి హిందూ టెర్రరిస్ట్ గా గురింపబడి వుండేవాడు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam