DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానసిక వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డికి మరో అవార్డు 

(డాక్టర్ భుజంగరావు స్మారక ప్రసంగ పురస్కారం)

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 30, 2020  (డి ఎన్ ఎస్):* ఖమ్మం సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యాన  గత సంవత్సరం నుంచి   ఏటా ఒక్కరికి ఇచ్చే  డాక్టర్ భుజంగరావు స్మారక ప్రసంగ పురస్కారం 2020 సవత్సరానికి డాక్టర్ కర్రిరామారెడ్డిని

ఎంపిక చేసారు. నవంబర్ 29 ఆదివారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో జూమ్ ఆన్‌లైన్ ద్వారా పురస్కారప్రసంగం ప్రసారం చేసారు. "మానసిక వైద్యంలో యోగచికిత్స శాస్త్రీయత" అనే అంశం పై ప్రసంగించిన డాక్టర్  రామారెడ్డి కేవలం గత ఒక్కసంవత్సరకాలలోనే యోగచికిత్సపై జరిగిన 650 శాస్త్రీయపరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ, ఆధునిక మానసిక

వైద్యంలో యోగశాస్త్రాన్ని ఏవిధంగాసమన్వయ పరచుకోవచ్చో వివరించారు.
  సన్మానపత్రం, పతకంతో ప్రసంగ పురస్కారాన్ని స్వర్గీయ డాక్టర్ భుజంగరావు  విద్యార్ధిని, డాక్టర్ కర్రిరామారెడ్డి  కుమార్తె అయిన డాక్టర్ కర్రి (పెద్దింటి) మానస చేతులమీదుగా  డాక్టర్ కర్రిరామారెడ్డికి ఇప్పించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా

తెలంగాణా సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ జగన్నాథ్ విచ్చేసారు.  దక్షిణ భారత సైకియాట్రిష్టుల సంఘం మాజీ అధ్యక్షులు డాక్టర్ కిషన్, డాక్టర్ నసీరాబాది అధ్యక్షత వహించారు. తెలాంగాణా ప్రైవేట్ సైకియాట్రిష్టుల సంఘం అధ్యక్షులు డాక్టర్ జార్జి రెడ్డి, డాక్టర్ భాగ్యారెడ్డి,డాక్టర్ శొభాదేవి గార్లు గౌరవ అతిథులుగా

విచ్చేసారు.  డాక్టర్ సతీష్ బాబు, డాక్టర్ ణారాయణరావు, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ రఘురామ్  కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 100మంది మానసికవైద్యులు, యోగశాస్త్రాభిలాషులు  జూమ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam