DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలిద్దాం: నన్నయ వీసీ మొక్కా 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 01, 2020  (డి ఎన్ ఎస్):*  ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించడం లో యువత కీలక పాత్రను పోషించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవంలో భాగంగా ఎన్ఎస్ఎస్

ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రపంచదేశాలను వణికించిన మహమ్మారి ఎయిడ్స్ అని అన్నారు. గణాంకాల ప్రకారం ఎయిడ్స్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. ఎయిడ్స్ నిర్మూలనకు యువత పాటుపడాలని, ప్రజలందరికీ అవగాహన

కల్పించాలని అన్నారు. నిరక్షరాస్యులైన ప్రజలకు ఇటువంటి వ్యాధులపై ఏ మాత్రం అవగాహన ఉండడం లేదని చెప్పారు. స్వల్పకాల సుఖం కోసం శాశ్వత జీవితాన్ని కోల్పోతున్నారని తెలిపారు. సమాజాన్ని సమగ్రమైన మార్గంలో తీర్చిదిద్దే గల సామర్ధ్యం యువతకు ఉందని తెలియజేశారు. రిజిస్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్

డా.బి.కెజియారాణి, ప్రోగ్రాం అధికారులు రాహుల్, పద్మవల్లి, ప్రసాద్, విశ్వవిద్యాలయ ప్రాంగణ కళాశాల విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam