DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టెక్నాలజీ వినియోగం లో దేశములోనే నెం 1 ఆంధ్ర పోలీస్ 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 02, 2020  (డి ఎన్ ఎస్):*  జాతీయస్థాయిలో పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగం పై నిన్న స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 18 అవార్డులలో ఐదు అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక తెలుగు రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ  నిలిచింది. 

* తాజాగా  స్కోచ్

గ్రూప్ ప్రకటించిన  అవార్డులలో ఐదు  గెలుచుకోగా అందులో ప్రాజెక్ట్ టాటా, సైబర్ మిత్ర(మహిళ భద్రత)  రజత పతకాలు కైవసం చేసుకున్న ఏపీ పోలీస్*
 
జాతీయ స్థాయిలో భారీగా అవార్డులను కైవసం చేసుకోవడం ఏపీ పోలీసులకు నెల వ్యవధిలో  ఇది మూడోసారి.

సైబర్ మిత్ర తో పాటు అఫెండర్ సెర్చ్, ఉమెన్ సేఫ్టీ (విజయనగరం జిల్లా),

సువిధ (అనంతపురం), ప్రాజెక్ట్ టాటా (ప్రకాశం జిల్లా)విభాగాల్లో ఐదు స్కోచ్ అవార్డులు సొంతం చేసుకున్నాయి

కేవలం 11నెలల కాల వ్యవధిలో 108 జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇప్పటి వరకు సాధించిన అవార్డులో  రెండు బంగారు, 13రజిత పతకాలను ఎపి పోలీస్ శాఖ

సాధించింది.

అందుబాటులో ఉన్న అత్యంత  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న సిబ్బందిని ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ లు అభినందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam