DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చెల్లని టర్కీ కరెన్సీ పట్టివేత, ఆరుగురు అరెస్ట్. .  

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 02, 2020  (డి ఎన్ ఎస్):* చెల్లని టర్కీ కరెన్సీ నోట్లను చెలామణి చేయించే ప్రత్యత్నం చేసిన ఆరుగురు వ్యక్తులను విశాఖ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో స్థానిక ఎంవిపి కొలని పొలిసు

అధికారి వీరి నిర్వాకాన్ని వివరించారు. ఒకటో తేదీన సమయం సుమారు రాత్రి 08:30 గంటలకు mvp పోలీసువారికి సమాచారం వచ్చిందని తెలిపారు. క్రిష్ణ కాలేజ్ గేటు ఎదురుగా ఉన్నటువంటి రోడ్డులో సి ఐ రమణయ్య  మరియు సిబ్బంది వెళ్లేసరికి అక్కడ కొంత మంది పోలీసులను చూసి పారి పోయే ప్రయత్నంచేయడం తో  సిఐ  రమణయ్య పట్టుకున్నారు. వీరిలో 1) బుల

రామస్వామి 2) నాంభారీ నారాయణరావు 3)దమ్మేటి సత్య వెంకట ప్రసాద్ 4)దలాలి యశోద 5)ఇందిలా పృధ్వీరాజ్ 6) మువ్వల ప్రసాద్ లు ఉన్నారు. 
వీరిని విచారించగా వాళ్ల వాళ్లు టర్కీ కి సంబంధించిన చెల్లని కరెన్సీ నోట్లను ఎక్కువ డబ్బులకు మార్చి ఇతరులను మోసం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కరెన్సీ నోట్లను ఎలా చేయాలి ఏమి చేయాలి అని

మాట్లాడుకుంటుండగా పట్టుబడ్డారు అని తెలిపారు. అ సి ఐ పి. రమణయ్య ఆ కరెన్సీ నోట్లను తనిఖీ చేయగా టర్కి దేశానికి సంబంధించిన గా తెలిసినవి. మధ్యవర్తుల సమక్షంలో 300 కరెన్సీ నోట్లను మరియు ఏడు సెల్ ఫోన్స్ ను వారి వద్దనుండి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు వారిని విచారించగా ఈ మార్పిడి చేసి కమిషన్ వస్తుంది అన్న ఆశతో మరియు ఇతరులను

మోసం చేసి డబ్బు సంపాదించవచ్చు అన్న దురుద్దేశంతో దుర్బుద్ధితో ఈ విధంగా చేసినట్లు తెలియజేసినారు. వీరందరూ ముఠాగా ఏర్పడి ఈ విధమైనటువంటి మోసాలు చేస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్లో తెలియజేశారు. ప్రజలు ఇటువంటి మోసపూరిత మాటలకు చర్యలకు బలి కావద్దని ఈ సందర్భంగా డబ్బు సంపాదన ధ్యేయంగా తప్పుడు మార్గాలు అన్వేషించి వాటికి

ఆకర్షితులు కావద్దని తెలియజేశారు ముద్దాయిలు పై మోసపూరితమైన ఉద్దేశంతో ఇటువంటి చర్య చేయటంవల్ల చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నామన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam