DNS Media | Latest News, Breaking News And Update In Telugu

151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి ఎందుకంత భయం

*నాయుడుపేటలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 04, 2020  (డి ఎన్ ఎస్):*  తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చానని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని మమ్మల్ని ఆపగలిగితే ఆపండి అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం

చేశారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శిద్దామని వస్తే ఆపే ప్రయత్నం చేస్తున్నారు.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి జనసేన అంటే ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. ఇది ఏమైనా మీ జాగీరా అంటూ నిలదీశారు. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంపైనా వైసీపీకి ఎంత హక్కు ఉందో మాకూ అంతే హక్కు ఉందని... అధికారం ఉంది కదా అని పోలీసుల సాయంతో

అడ్డుగోడలు కడదామని చూస్తే వాటిని బద్దలు కొట్టుకుని ముందుకు వెళ్తామని హెచ్చరించారు. 
నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, రైతుల్ని పరామర్శిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ ఉన్నారు. 
/> నాయుడుపేటలో పవన్ కళ్యాణ్ గారు రైతులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 
"పరామర్శకు వచ్చిన మమ్మల్ని ఆపితే ఆపండి చూద్దాం. ఓడిపోతే చాలా మంది బయటకు రారు.. ఆశయం ఉన్నవాడికి గెలుపు ఓటములతో పని లేదు. వైసీపీ నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నా.. మీ అధికారాన్నిఅడ్డుపెట్టుకుని మమ్మల్ని ఆపండి చూద్దాం. ఈ ప్రాంతం మీ

జాగీరా.. నేను వస్తే ఆపుతారా.. ఎంత మందిని ఆపుతారు? ఇక్కడికి వచ్చిన ఒక్క జనసైనికుడిని ఆపండి చూద్దాం. నేను రైతుల్ని పరామర్శించేందుకు వచ్చాను మీతో గొడవ పెట్టుకోవడానికి కాదు. సింహపురిలో పెరిగినవాడిని. ఎవ్వరికీ భయపడను. మేము వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టడం లేదు. మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోం. రోడ్ల మీదకు

రావడానికి కూడా వెనుకాడం అన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam