DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ ఇవ్వకుంటే - బీజేపీ కి ఓటు వెయ్యకండి : : జన జాగరణ డిమాండ్ 

పార్లమెంట్ సమావేశాల్లోనే రైల్వే జోన్ ప్రకటించాలి 

విశాఖపట్నం, జులై  19 , 2018 (DNS Online ):  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ జరుగుతున్నా పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖపట్నం కేంద్రంగా

రైల్వే జోన్ ప్రకటించాలని, ఇవ్వకుంటే బీజేపీ కి ఓటు వేయవద్దని జన జాగరణ సమితి నినాదాలు చేసింది. గురువారం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎదురుగా గల

గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నా లో జన జాగరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు వాసు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వాసుల మూడున్నర దశాబ్దాల చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్

అని, దాన్ని ఇస్తామని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు గత ఎన్నికల్లో ప్రచారం చేసుకుని ఓట్లు తీసుకున్నారని, తీరా అధికారం లోకి వచ్చాక, తుంగలోకి

తొక్కారన్నారు. విశాఖపట్నం లో తగినన్ని భూములు, ఆస్తులు రైల్వే కు ఉన్నాయని, సంవత్సరానికి సుమారు 7200 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తున్న విశాఖపట్నం రైల్వే డివిజన్ పై

తూర్పు కోస్త రైల్వే అధికార జులుం ప్రదర్శిస్తూ. ప్రయాణీకులకు అన్యాయం చేస్తోందన్నారు. రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫారమ్ లు సవ్యంగా లేవని, రైళ్లల్లో బెర్తులు

కేటాయింపు లో మోసం చేస్తున్నారని, ఉద్యోగాలను కేవలం ఒరిస్సా వారికే ఇస్తున్నారని, తెలుగువారు వ్రాత పరీక్షలకు భుబనేశ్వర్ కె వెళ్లాలని, అక్కడికి వెళ్లిన వారి

సెర్టిఫికెట్లు చించి వేస్తున్నారని, పైగా భౌతిక దాడులు కూడా చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు కళ్ళు మూసుకు పోయారన్నారు. విశాఖ

రైల్వే జోన్ కోసం విద్యార్షి గర్జన నిర్వహించిందన్నారు. 

 

@ copy rights reserved

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam