DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నష్టపోయిన రైతాంగానికి మద్దతుగా 7న జనసేన నిరసన దీక్ష

*మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు కేటాయించాలి.*

*మీడియా సమావేశం లో జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, డిసెంబర్ 05, 2020  (డి ఎన్ ఎస్):*  ఆర్థికంగా నష్టపోయిన రైతాంగానికి మద్దతుగా 7న జనసేన నిరసన దీక్ష చేస్తున్నట్టు జనసేనాని పవన్

కల్యాణ్ తెలిపారు. శనివారం నెల్లూరు పర్యటనలో ఆయన మీడియా సమావేశం చేపట్టారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ. 10 వేల రూపాయిల ఆర్ధిక సాయం అందించాలనీ, ఎకరాకి రూ. 35 వేల ఆర్ధిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రకటన రాని పక్షంలో రైతాంగానికి మద్దతుగా ఈ నెల 7వ తేదీన అన్ని

జిల్లాల్లో జనసేన పార్టీ నిరసన దీక్షలు చేపడుతుందని తెలిపారు. రైతుల్లో మనోనిబ్భరం నింపేందుకే డిమాండ్ చేస్తున్నామన్నారు. 

వరుసగా మూడు పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బ తినడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వాలి పోయిన పంటను తీయాలన్నా ఎకరాకి రూ. 8 వేలు నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే కళ్ల

ముందే పంట ఉన్నా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రూ. 35 వేలు ఇస్తే ఎంతో కొంత బయటపడతారు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందు ఆ డిమాండ్ పెట్టాం. తక్షణ సాయం అందించడానికి 48 గంటల సమయం ఇచ్చాం. ఈ పరిస్థితుల్లో మనుషులు మనోనిబ్బరం కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి తక్షణ సాయం అందించాలి. 

• ఆంధ్ర గోల్డ్ అంటే

మద్యం బ్రాండ్ అనుకోలేదు: . .

151 మందితో బంగారు పాలన ఇస్తారనుకుంటే మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని
రాష్ట్రానికి రూ.16వేల కోట్ల మద్యం ఆదాయం ఉంది కదా, రూ. 35 వేలు పంట నష్ట పరిహారంతోపాటు రూ. పది వేలు తక్షణ సాయం అందించాలని అడుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువయ్యిందన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా అంటే

 మంత్రుల నుంచి వైసీపీ నాయకుల వరకూ అంతా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బలంగా ఉందని చెబుతున్నారు. మద్యపానం మీద వచ్చే ఆదాయం వద్దనుకునే వైసీపీ నాయకులు మద్య నిషేధం చేస్తామన్నారు. ఇప్పుడు ఏటా రూ. 16 వేల కోట్ల పై చిలుకు ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. వైసీపీ నాయకులకు ఆ ఆదాయం అక్కరలేనప్పుడు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం

రైతులకు అందచేయండి. ఐదు జిల్లాల్లో నివర్ తుపాను కారణంగా 17 లక్షల పైచిలుకు ఎకరాలు నష్టం వాటిల్లింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నష్టపోయిన రైతులకు అందచేయండి.

జీహెచ్ఎంసీ తీర్పు.. అధికార మార్పుకు సంకేతం: . . .

తెలంగాణాలో  జీహెచ్ఎంసీ ఎన్నికల్ని విశ్వనగరం ఎన్నికలుగా అందరూ చూశారన్నారు. 
/> జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారన్న విషయం అర్ధమయ్యింది. కొత్త తరహా పాలనా వ్యవస్థను కోరుకుంటున్నారు. అందుకే కేంద్ర నాయకత్వం రావడం.. అన్ని ప్రాంతాల ప్రజలకు ఇది సురక్షిత నగరం అన్న ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. జనసేన శ్రేణులు 60 డివిజన్లలో పోటీ చేద్దామనుకున్న పరిస్థితుల్లో బీజేపీతో ఇక్కడ అవగాహనతో

ముందుకు వెళ్తే మంచిది అనిపించింది.

ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకూడదు అన్న ఒక్క పిలుపు మేరకు 60 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బీజేపీ గెలుపులో జనసైనికులు వారికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి సహకరించినందుకు జనసేన శ్రేణులు, జనసైనికులకు కృతజ్ఞతలు

తెలిపారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను.  ఈ సందర్భంగా పెద్దన్న లాంటి డాక్టర్ లక్ష్మణ్ కి శుభాకాంక్షలు.  బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ గారు అందరినీ సమాయత్తపరిచినందుకు ధన్యవాదాలు. టైగర్ సంజయ్ అనే స్థాయికి ఆయన ఎదిగారు. తిరుపతి ఎన్నికల్లో ఇరు పార్టీలు  సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి అది ఇచ్చే నివేదిక మీద

ముందుకు వెళ్తాం. తక్కువ సమయంలో పర్యటనకు ఏర్పాట్లు చేసిన నాలుగు జిల్లాల నాయకులకు ధన్యవాదాలు” అన్నారు.

ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్,  పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్హం ఖాన్, ప్రధాన కార్యదర్శులు టి.శివ శంకర్, సత్య బొలిశెట్టి, పి.ఏ.సి  సభ్యులు మనుక్రాంత్ రెడ్డి,

 డాక్టర్ పి. హరిప్రసాద్ పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam