DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిసెంబర్ 10 న పార్లమెంటు కొత్త భవనానికి మోదీ శంకుస్థాపన

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 05, 2020  (డి ఎన్ ఎస్):* దేశ రాజధాని న్యూఢిల్లీ లో  కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10వ తేదీన శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ జరుపుతారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయం మీడియాకు తెలిపారు. ఫౌండేషన్ లేయింగ్ సెర్మనీ

జరిపే ప్రదేశాన్ని నిర్ణయించేందుకు గత వారంలో అధికారులతో కలిసి ఓం బిర్లా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శంకుస్థాపన కోసం లాంఛనంగా ప్రధానిని ఓం బిర్లా ఆహ్వానించినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
 
ఈనెలలోనే కొత్త పార్లమెంటు భవన నిర్మాణం పనులు మొదలవుతాయి. లోక్‌సభ ఛాంబర్‌లో ప్రస్తుతం 543 సభ్యులకు

అవసరమైన సీటింగ్ కెపాసిటీ ఉండగా, కొత్త భవంతిలో సీట్ల సామర్థ్యం 888 వరకూ ఉంటుంది. రాజ్యసభ ఛాంబర్‌లోనూ 245 మంది సభ్యులకు ప్రతిగా 384 సీట్లు ఏర్పాటు చేస్తారు. సంయుక్త సమావేశాలకు గాను లోక్‌సభ ఛాంబర్ సామర్థ్యం 1,272 సీట్ల వరకూ ఉంటుంది. రెండేళ్లలోపే నూతన పార్లమెంటు భవన నిర్మాణం పూర్తవుతుందని, 75వ భారత స్వాంతత్ర్య దినోత్సవం

నాటికి పార్లమెంటు భవనం ముస్తాబవుతుందని కొత్త కార్యాలయం బాధ్యతలు చేపట్టిన సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam