DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నన్నయ వర్శిటీ అలుమ్ని ఏర్పాటు చేయాలి : వీసీ మొక్కా

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 07, 2020  (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణ కళాశాలల అలుమ్నిలను ఏర్పాటు చేయాలని వీసీ మొక్కా జగన్నాథరావు తెలియజేశారు. విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ పూర్వ

విద్యార్థుల సంఘమైన స్పృహ అలుమ్ని ఆసోసియేషన్ ప్రెసిడెంట్ సుంకర నాగేంద్ర కిషోర్ సోమవారం వీసీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీసీ ఆయన్ను సన్మానించి విశ్వవిద్యాలయ ప్రాంగణ కళాశాలలో అలుమ్ని స్థాపన మరియు కార్యక్రమాలపై సమగ్రమైన కార్యచరణ రూపొందించాలని అని తెలిపారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిదర్శనంగా

ఉండే అలుమ్ని విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఉన్న ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రత్యేక అలుమ్ని లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతో ఉందని అన్నారు. దేశ విదేశాల్లోని విద్యార్థులను ఏకతాటి పైకి తీసుకువచ్చి ప్రపంచం దేశాలలో నన్నయ

విశ్వవిద్యాలయం ఖ్యాతిని వికసింప చేయాలని తెలియజేశారు. దీనిపై సుంకర నాగేంద్ర కిషోర్ మాట్లాడుతూ వీసీ సూచన మేరకు క్యాంపస్లోని నాలుగు కళాశాలలకు అలుమ్ని ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వీసీ ఆలోచనలకు అనుగుణంగా విశ్వవిద్యాలయ అభివృద్ధి లో భాగస్వామ్యం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సైకాలజీ విభాగ

అధ్యాపకులు డా. పడాల రాజశేఖర్, స్పృహ అసోసియేషన్ సెక్రెటరీ రాజేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam