DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు వింత వ్యాధిగ్రస్తుల పరామర్శలో సీఎం జగన్

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 07, 2020  (డి ఎన్ ఎస్):* వింత వ్యాధితో ఏలూరులో అస్వస్థతకు గురైనవారిని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రభుత్వాసుపత్రిలో బాధితులను కలుసుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా అండగా ఉంటామని

బాధితులకు భరోసా నిచ్చిన ఆయన వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. తర్వాత జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. సమీక్షా సమావేశానికి మంత్రులు ఆళ్లనాని, శ్రీరంగనాథ రాజు తానేటి వనిత, పేర్నినాని తదితరులు హాజరు అయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనికుమార్‌ సింఘాల్,

వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సహా పలువురు అధికారులు హాజరు అయ్యారు. అస్వస్థతకు గురైన వారికి అందిస్తున్న వైద్య సహాయం సహా ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అడిగితెలుసుకున్నారు. అస్వస్థతకు దారితీసిన కారణాలపై ఆరా తీసారు. ఇప్పటివరకూ చేసిన పరీక్షల వివరాలను అడిగితెలుసుకున్నారు.

తాగునీటిపై పరీక్షలు చేయించామని, రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు తెలిపారు. హెవీమెటల్స్‌పైనకూడా పరీక్షలు చేశామని అవికూడా సాధారణస్థాయిలోనే ఉన్నాయని అధికారులు వివరించారు. వివిధ రోగాలకు కారణ మవుతున్న వైరస్‌లపై అన్ని పరీక్షలు చేశామని, అవన్నీకూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయన్నారు. 
బ్లడ్‌ కల్చర్‌

రిపోర్టు రావడానికి కొంత సమయం పడుతుందని, వాటి ఫలితాలకోసం వేచి చూస్తున్నామని అధికారులు తెలిపారు. 

సీటీ స్కాన్‌ రిపోర్టులు కూడా సాధారణంగానే ఉన్నాయని అధికారులు తెలిపారు. 

అస్వస్థతకు కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. 

ఏలూరు అర్బన్‌ ప్రాంతంలోనే కాకుండా ఏలూరు రూరల్,

దెందులూరు పరిధిలోకూడా కేసులు గుర్తించామన్న అధికారులు తెలిపారు. 

పలానా వయస్సు ఉన్నవారికిమాత్రమే అస్వస్థత రావడంలేదని, అన్ని వయస్సులు వారూ ఉన్నారన్న అధికారులు తెలిపారు. 

నీళ్లు వేడిచేసుకుని తాగేవారికీ అస్వస్థతకు గురవుతున్నారని, అలాగే మినరల్‌వాటర్‌ తాగేవారికీ వస్తుందన్న అధికారులు

తెలిపారు. 

ఎయిమ్స్‌ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని, ఇవాళ ఐఐసీటీ, ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్‌ నుంచి కూడా బృందాలు వస్తున్నాయన్న అధికారులు తెలిపారు. 

డిశ్చార్జిచేసిన వారిలో తిరిగి ఆస్పత్రికి వచ్చిన సందర్భాలు ముగ్గురు ఉన్నారని అధికారులు తెలిపారు. డిశ్చార్జి చేసిన వారినికూడా అబ్జర్వేషన్‌లో

ఉంచాలని సీఎం తెలిపారు. డిశ్చార్జి అయిన వారికి సరైన ఆహారం, మంచి మందులు అందించాలని సీఎం ఆదేశం జారీచేశారు. 
వైద్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. 

ఎయిమ్స్‌ సహా  ఐఐసీటీ, ఎన్‌ఐఎన్‌ బృందాలు వచ్చాక వారి పరిశీలనలనూ పరిగణలోకి తీసుకోవాలన్న సీఎం

ఏ ఘటన జరిగినా వెంటనే

స్పందించేలా ఉండాలన్న వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఏలూరులో ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఎవరికి ఏం వచ్చినా 104, 108 నంబర్లకు కాల్‌చేసేలా అవగాహన కల్పించాలని, కాల్‌ వచ్చిన వెంటనే వారికి వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేసించారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam