DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మున్సిపల్ కార్మికుల వేతన బకాయిలు తర్వలో చెల్లింపు

*జెఎసి నేతలకు పురపాలక శాఖ మంత్రి బొత్స హామీ*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 14, 2020  (డి ఎన్ ఎస్):*     

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పెండింగ్ లో ఉన్న శానిటరీ హెల్త్ వర్కర్ల వేతన బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ

మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎపి మున్సిపల్ కార్మికుల, ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులు తమ సమస్యలపై సోమవారం సాయంత్రం విజయవాడ క్యాంపు ఆఫీసులో మంత్రి గారిని కలుసుకుని మెమొరాండం సమర్పించారు. ఈ  సందర్భంగా వారి  సమస్యలను తెలుసుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల

పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న వేతనాలతో పాటు, హెల్త్ అలెవెన్సులను కూడా చెల్లించేలా చూస్తామని మంత్రి జెఎసి నాయకులకు భరోసా ఇచ్చారు.     అలాగే  బదిలీ కార్మికులు, ఇంజనీరింగ్ – టౌన్ ప్లానింగ్ కార్మికులు  స్కూల్ స్వీపర్స్ సమస్యలు, ఇఎస్ఐ, పిఎఫ్ వంటి వాటిపై కూడా ప్రభుత్వ పరంగా

 పరిశీలించి చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు.
ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు జి.సుబ్బారావు, కె.ఉమామహేశ్వరరావు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam